Acharya : మెగాస్టార్ కోసం రంగంలోకి సీఎం ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “ఆచార్య”. కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. మ్యూజికల్ రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం సమకూరుస్తున్నారు. “ఆచార్య” మూవీని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మెగా పవర్ ప్యాక్డ్ మూవీని ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పుడు సినిమాకు సంబంధించిన ప్రమోషన్లపై దృష్టి పెట్టబోతున్నారు మేకర్స్. ఇప్పటికే “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఉత్కంఠత నెలకొంది.
Read Also : KGF 2 : పవర్ ఫుల్ డైలాగ్స్… హనుమాన్ చౌదరి ఎంట్రీ ఎలాగంటే ?
Also Read
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
తాజాగా మరింత ఆసక్తిని రేకెత్తిస్తూ “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. “ఆచార్య” నిర్మాతలు ఏప్రిల్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారంటూ ఇప్పటికే టాక్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజా అప్డేట్ ఏంటంటే… మెగాస్టార్ కోసం ఏకంగా సీఎం రంగంలోకి దిగబోతున్నారట… అది కూడా ఏపీ సీఎం జగన్!. విజయవాడ సిద్ధార్థ కళాశాల వేదికగా జరగనున్న “ఆచార్య” ప్రీ రిలీజ్ ఈవెంట్కు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం జరగనుందని సమాచారం. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. సీఎం జగన్తో చిరంజీవికి మంచి సాన్నిహిత్యం ఉందన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చొరవతోనే భారీ బడ్జెట్ చిత్రాలకు ఏపీలో టికెట్ రేట్ల విషయమై ఊరట లభించింది. మరోవైపు “ఆచార్య” సినిమాను నిర్మిస్తున్నది సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు, న్యాయ సలహాదారుడు అయిన నిరంజన్రెడ్డి. “ఆచార్య” ఈవెంట్ కు ఏపీ సీఎం ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ క్రేజీ న్యూస్ లో నిజం ఎంతో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!