Santhosh Sobhan: టైమ్ దొరికితే ప్రభాస్ కు ఈ మూవీ చూపించడం నా డ్రీమ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Santhosh Sobhan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘వర్షం’కు శోభన్ దర్శకత్వం వహించారు. ఒకే ఒక్క సినిమాతో శోభన్ తో ఏర్పడిన అనుబంధాన్ని ఇప్పటికీ ప్రభాస్ మర్చిపోలేదు. శోభన్ భౌతికంగా లేకపోయినా ఆయన కొడుకు, నటుడు సంతోష్ శోభన్ మూవీస్ ప్రమోషన్స్ ను అవకాశం ఉన్నంత మేరకు చేస్తూ వస్తున్నారు ప్రభాస్. సంతోష్ శోభన్ లేటెస్ట్ మూవీ ‘లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్’ శుక్రవారం జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో సంతోష్ శోభన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ, ”ప్రభాస్ గారు ఇండియా బిగ్గెస్ట్ స్టార్. ఆయన్ని ఎప్పుడు కలిసినా అభిమానిగానే కలిశా. కలిసినప్పుడల్లా చాలా హ్యాపీ. లైఫ్ లాంగ్ ఆయన్ని అలా అభిమానిగా కలిసినా చాలు. మేం ఎప్పుడు కలిసినా ఆయనకున్న సమయం ప్రకారం టీజర్, ట్రైలర్, సాంగ్ ఇలా ఏదో ఒకటి రిలీజ్ చేస్తారు. ఇది ఆయన గొప్పదనం. ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు. ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ నేను గర్వపడి, నమ్మిన సినిమా. ఆయనకి సమయం కుదిరితే ఈ సినిమా చూపించడం నా డ్రీమ్” అని అన్నారు. తన తండ్రి చనిపోయి 14 సంవత్సరాలు అయినా.. ఇప్పటికే సినిమా రంగంలోని అనేకమంది ఆయనను గుర్తు చేసుకోవడం, ఆయన కొడుకుగా తనను గౌరవించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని, అందుకే మరింత కష్టపడి సినిమాలు చేయాలనే భావన తనకు కలుగుతుంద’ని సంతోష్ శోభన్ చెప్పారు.
‘ఏక్ మినీ కథ’కు కథను అందించిన మేర్లపాక గాంధీ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, అప్పట్లోనే ఆయనతో ప్రయాణం కొనసాగించాలని అనుకున్నానని, ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించడం సంతోషాన్ని కలిగించదని తెలిపాడు. ఈ సినిమా ఫస్ట్ ఛాయిన్ తానేనని మేర్లపాక గాంధీ చెప్పారని, దానిని తాను నమ్ముతున్నానని చెబుతూ, ”ఇందులో యూట్యూబర్ విప్లవ్ పాత్ర నాకు చాలా హై ఇచ్చింది. కెరీర్ లో మొదటిసారి నా ఏజ్ పాత్రలో చేస్తున్నా. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లా హైపర్ ఎనర్జిటిక్ క్యారెక్టర్. చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ చేశా” అని అన్నారు.
Also Read
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
తన కొత్త సినిమాల గురించి వివరిస్తూ, ”డిసెంబర్ 21 నందిని రెడ్డి గారి సినిమా ‘అన్ని మంచి శకునములే’ వస్తోంది. అలాగే యువీ క్రియేషన్స్ లో ‘కళ్యాణం కమనీయం’ మూవీ చేశాను. సమయం కుదిరితే ఓటీటీలకు కూడా చేయాలని వుంది. వ్యక్తిగతంగా నాకు యాక్షన్ కామెడీలు ఎక్కువ ఇష్టం” అని సంతోష్ శోభన్ తెలిపాడు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!