17న విడుదలవుతున్న ‘హానీ ట్రాప్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సందేశాత్మక అంశాలను కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. గతంలో ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, వలస, గల్ఫ్’ లాంటి సందేశాత్మక సినిమాలును ఆయన రూపొందించారు. ఇప్పుడు సమకాలీన కథతో తెరకెక్కించిన ‘హనీ ట్రాప్’ మూవీని సెప్టెంబర్ 17 న విడుదల చేయటానికి సిద్ధమౌతున్నారు. రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను వి. వి. వామనరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించిన నిర్మాత వామనరావు ఓ కీలక పాత్ర కూడా పోషించడం విశేషం.
ఈ సినిమా గురించి వామనరావు మాట్లాడుతూ, ”మిత్రుడు పి.యల్.కె. రెడ్డి ద్వారా సునీల్ కుమార్ రెడ్డి గారు పరిచయమయ్యారు. ఆయన రొమాంటిక్ సినిమాలు తీసినా అందులో అండర్ కరెంట్ మెసేజ్ తప్పకుండా ఉంటుంది. తను తీసిన రొమాంటిక్ సినిమాలన్నీ కమర్షియల్ గా విజయం సాధించాయి. ఆ సినిమాల కంటే భిన్నంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు మంచి మైలేజ్ వస్తుందనే నమ్మకం ఉంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఇందులోని సీన్స్ కట్ చేస్తే మూలకథకు ఇబ్బంది అవుతుందని భావించి, సీన్స్ కట్ చేయకుండానే మమ్మల్ని ప్రశంసించి, ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇది మేము గ్రేట్ అచీవ్మెంట్ గా భావిస్తున్నాం” అని అన్నారు.
Also Read
- Tollywood : ఆగస్టులో యుక్తి తరేజా Vs రితికా నాయక్.. ఇద్దరి బ్యూటీల మధ్య గట్టి ఫైట్
- 72nd National Film Awards : 72వ జాతీయ అవార్డులపై విమర్శలు.. అద్భుతమైన సినిమాలకు నో అవార్డ్స్
- Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
- Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ”నేను దర్శకత్వం వహించిన సినిమాలకు కథ నేనే రాసుకునే వాడిని. మొదటిసారి బయటి కథను డైరెక్ట్ చేశాను. నేనెప్పుడూ కాన్టెంపరరీ కథలు చేస్తుంటాను. వామనరావు గారు చాలా సెన్సిబుల్ రైటర్. నంది అవార్డు పొందిన నాటకాలను రచించిన రచయిత. ‘హనీ ట్రాప్’కు మంచి కథను ఇచ్చారు. మా ‘గల్ఫ్’ సినిమాలో నటించిన డింపుల్ బాలీవుడ్ కు ఎలా వెళ్ళిందో.. అలాగే ఈ చిత్రంలో నటించిన వారందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి. బాపిరాజు, హీరోహీరోయిన్లు రిషి, శిల్ప నాయక్ కూడా పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
-
Uttarakhand Rains: వర్షంలో విషాదం.. పైప్లో ఇరుక్కొని ఆరేళ్ల పిల్లాడు మరణం..
-
Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
-
Tollywood : ఆగస్టులో యుక్తి తరేజా Vs రితికా నాయక్.. ఇద్దరి బ్యూటీల మధ్య గట్టి ఫైట్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!