Harish Shankar: మైత్రీ మూవీ మేకర్స్ దిష్టి తీయించుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సర్కారు వారి పాట’ హంగామానే నడుస్తోంది. సూపర్స్టార్ మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ఈ చిత్రం.. ఈరోజే (మే 12) ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య వచ్చింది. అంచనాలకి తగ్గట్టుగానే ఇది ఆకట్టుకోవడంతో, సర్వత్రా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా.. చాలాకాలం తర్వాత వింటేజ్ మహేశ్ బాబుని చూశామన్న అభిప్రాయాల్ని ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా వ్యక్తపరుస్తున్నారు. కేవలం సినీ ప్రియులే కాదండోయ్.. సెలెబ్రిటీలు సైతం ఆ యూఫోరియాను ఎంజాయ్ చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా చూసిన దర్శకుడు హరీశ్ శంకర్.. ట్విటర్ మాధ్యమంగా తన రివ్యూ ఇచ్చాడు. ‘‘ఈ సినిమాలో మహేశ్ బాబు స్వాగ్, టైమింగ్ అదిరిపోయాయి. నిజంగా ‘సర్కారు వారి పాట’ ఓ రియల్ ట్రీట్ లాంటిది. హిలేరియస్, పవర్ఫుల్ పాత్రల్ని ప్రెజెంట్ చేసిన దర్శకుడు పరశురామ్కి హ్యాట్సాఫ్. ఈసారి మైత్రీ మూవీ మేకర్స్ దిష్టి తీయించుకోవాలి’’ అంటూ హరీశ్ చెప్పుకొచ్చాడు. అసలే ఫ్యాన్స్ పాజిటివ్ టాక్ వచ్చిన ఆనందంలో మునిగితేలుతుండగా, హరీశ్ ఇచ్చిన రివ్యూతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మొత్తానికి, తమ ఆకలి తీర్చేలా మహేశ్ అదిరిపోయే సినిమాతో వచ్చాడని, తమ అభిమాన హీరోని ఇలా ‘వింటేజ్’ రూపంలో చూపించినందుకు పరశురామ్కి థ్యాంక్స్ చెప్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read
- Jana Nayagan: ఎట్టకేలకు పూర్తయిన జన నాయగన్ సెన్సార్.. ఆరోజు రిలీజ్
- Agadha:14 మిలియన్ వ్యూస్తో సంచలనం.. ఎంఎస్ రాజు ‘అగధ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
- Trikala OTT: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన శ్రద్ధా దాస్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
ఇదిలావుండగా.. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. ఈ అమ్మడు సినిమాలో అందంగా కనిపించడంతో పాటు తన నటనతో ఆకట్టుకుందని మంచి మార్కులు పడ్డాయి. మహేశ్, కీర్తి మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్.. వారి మధ్య కెమిస్ట్రీకి పొగడ్తల వర్షం కురుస్తోంది. అటు, కొంతకాలం నుంచి టైమింగ్ కోల్పోయిన వెన్నెల కిశోర్ కూడా ఇందులో అదరగొట్టాడని అంటున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!