అదుర్స్ అనిపించిన కోన వెంకట్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఫిబ్రవరి 19న కోన వెంకట్ పుట్టినరోజు)
చదువుల తల్లి దయ ఉండాలే కానీ, రచనలు చేయవచ్చు. పదాలతో పదనిసలు పలికించవచ్చు. పదవిన్యాసాలతో మురిపించవచ్చు. పదబంధాలతో మైమరిపించవచ్చు. లక్ష్మీకటాక్షంతో నిర్మాతగా చిత్రసీమలో అడుగు పెట్టిన కోన వెంకట్, తరువాత సరస్వతీ కరుణతో కలం పట్టి కదం తొక్కారు. ఆ పై పలు వినోదాల తేరులను తన పదబంధాలతో పరుగులు తీయించారు. తరువాత నటునిగానూ అలరించారు.
కోన వెంకట్ 1965 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు. ఓ నాటి నటులు, తరువాత రాజకీయాల్లో రాణించిన కోన ప్రభాకర రావు మనవడే కోన వెంకట్. ఈయనను కూడా తాత ప్రభాకర్ రావు లాగే చిత్రసీమ ఆకర్షించింది. దాంతో తమ కుటుంబానికి పరిచయం ఉన్న ప్రముఖ రచయిత ఆత్రేయతో అనుబంధం ఏర్పరచుకున్నారు. ఆయనతో కలసి తిరగడం వల్ల చిత్రసీమలోని సాధకబాధకాలు ఇట్టే తెలుసుకున్నారు. వినోదం పంచే చిత్రాలను రూపొందించాలనే లక్ష్యంతో ప్రముఖ హాస్యనటులు ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ‘తోకలేని పిట్ట’ సినిమాను నిర్మించారు. తొలి చిత్రం నిరాశ పరచింది. అయినా, పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని భావించి, చిత్రసీమలోనే సాగారు. ఆ సమయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిచయం కావడం, ఆయన ప్రోత్సాహంతో కోన వెంకట్ రచయితగా మారారు. రాము హిందీలో తెరకెక్కించిన “సత్య” చిత్రం తెలుగు వర్షన్ కు కోన వెంకట్ మాటలు రాశారు. అలాగే హిందీ నుండి తెలుగులోకి అనువాదమైన “దిల్ సే, కౌన్, మస్త్, జంగిల్, కంపెనీ” చిత్రాలకూ అనువాద రచనలో పాలు పంచుకున్నారు.
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
రసూల్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘ఒకరికి ఒకరు’ సినిమాతోనే కోన వెంకట్ కు రచయితగా గుర్తింపు లభించింది. ఆ తరువాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’తో మంచి ఆదరణ దక్కింది. “శివమణి, వెంకీ, సాంబ, బాలు, భగీరథ, చుక్కల్లో చంద్రుడు, షాక్” చిత్రాలకూ రచన చేశారు వెంకట్. శ్రీను వైట్ల ‘ఢీ’తో రచయితగా కోన వెంకట్ కు మరింత పేరు లభించింది. ఆపై “రెడీ, చింతకాయల రవి, కింగ్, అదుర్స్, బాద్ షా, అఖిల్, బ్రూస్లీ, జై లవకుశ, నిశ్శబ్దం” చిత్రాలతోనూ ఆకట్టుకున్నారు.
1997లో ‘తోకలేని పిట్ట’ నిర్మించి, నష్ట పోయినా, మళ్ళీ 2014లో ‘గీతాంజలి’తో నిర్మాణంలో అడుగు పెట్టారు కోన వెంకట్. తరువాత “శంకరాభరణం, అభినేత్రి, సాహసమే శ్వాసగా సాగిపో, నిన్నుకోరి, నీవెవరో, నిశ్శబ్ధం, గల్లీ రౌడీ” చిత్రాల నిర్మాణంలోనూ పాలు పంచుకున్నారు. రామ్ హీరోగా రూపొందిన ‘ఎందుకంటే… ప్రేమంట!’ సినిమాలో విలన్ గానూ నటించారు కోన వెంకట్. 2008లో ‘నేను తను ఆమె’ చిత్రానికి దర్శకత్వం వహించారు. తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ సాగుతున్న కోన వెంకట్ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకుంటూ మరింతగా వినోదం పంచుతారని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!