హన్ శివ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.1గా ఓ నూతన చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వంలో ఎన్.మహేశ్వరి, పి.జ్యోతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనురాగ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలకు టాలీవుడ్ ప్రముఖులు హాజరై, చిత్ర బృందానికి తమ ఆశీస్సులు అందించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు ప్రముఖ దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, స్టార్ నిర్మాత కె.అచ్చిరెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి క్లాప్ కొట్టారు. నటుడు అలీ కెమెరా స్విచ్ ఆన్ చేసి అభినందనలు తెలిపారు. దర్శక దిగ్గజం ఎస్.వి.కృష్ణారెడ్డి తొలి షాట్కు గౌరవ దర్శకత్వం వహించి టీమ్లో ఉత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ టి.డి.ప్రసాద్ వర్మ మాట్లాడుతూ ఒక సరికొత్త, డిఫరెంట్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. నటుడు అలీ ఈ చిత్రంలో ఓ అత్యంత కీలక పాత్రలో మెప్పించనున్నారు. ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని సర్ప్రైజింగ్ డీటెయిల్స్ పంచుకుంటాం” అని తెలిపారు. హీరో అనురాగ్ తన ఎగ్జైట్మెంట్ను పంచుకుంటూ.. “ప్రసాద్ వర్మ చెప్పిన స్టోరీ పాయింట్ నాకు విపరీతంగా నచ్చింది. నాకు ఇంత మంచి ప్రొడ్యూసర్స్ సపోర్ట్ దొరకడం నా అదృష్టం. ఇందులో నేను పోషిస్తున్న విలక్షణమైన పాత్ర ఆడియెన్స్ను కచ్చితంగా అలరిస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
