విక్రాంత్ హీరోగా పరిచయమవుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’. ఛార్మింగ్ బ్యూటీస్ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ ఇందులో హీరోయిన్స్గా నటిస్తున్నారు. అరవింద్ కుమార్ రవివర్మ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దర్శకుడు రవివర్మ గతంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. సో ఈ మూవీ సినిమాటోగ్రఫీ బాధ్యతలూ ఆయనే హ్యాండిల్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ రోజునే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీలో టాలెంటెడ్ యాక్టర్, ‘మిన్నల్ మురళి’ ఫేమ్ గురు సోమసుందరం విలన్గా నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు తెలియజేస్తూ పోస్టర్ను విడుదల చేశారు.
తాజా ప్రోగ్రెస్ గురించి నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెబుతూ, ”ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్ సారథి స్టూడియోలో వేసిన రెండు భారీ సెట్స్లో చిత్రీకరణ జరుపుతున్నాం. అక్టోబర్ 3 నుంచి ఐస్ల్యాండ్లో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఆ తర్వాత మున్నార్, వైజాగ్ల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాం” అని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. మలయాళ చిత్రం ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ‘స్పార్క్’ మూవీకి ట్యూన్స్ అందిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్లో కీ-రోల్స్ కోసం రీసెంట్గా వెర్సటైల్ ఆర్టిస్ట్ నాజర్, సుహాసిని మణిరత్నం జాయిన్ అయ్యారు. వీరితో పాటు ‘వెన్నెల’ కిశోర్, షాయాజీ షిండే, సత్య, శ్రీకాంత్, కిరణ్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
