కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం ఫైర్… నోటీసులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వెంటనే ఓ షోలో పాల్గొనడంపై ఫైర్ అవుతూ నోటీసులు జారీ చేసింది. కమల్ హాసన్ కు నవంబర్ 22న కరోనా పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే. కమల్ హాసన్ స్వయంగా తనకు కోవిడ్ -19 సోకింది అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. యూఎస్ నుండి తిరిగి వచ్చిన వెంటనే కోవిడ్ -19కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కమల్ చికాగోలో తన దుస్తుల లైన్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించాడు. అక్కడ ఆయన వైరస్ బారిన పడ్డాడని అంటున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు.
Read also : పిక్స్ : మరదలి పెళ్ళిలో రామ్ చరణ్… యాని మాస్టర్ కు ప్రత్యేక బాధ్యత
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
- Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
దాదాపు వారం రోజులు ఆసుపత్రిలో ఉన్న కమల్ డిసెంబర్ 4న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కమల్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారని, మరో రెండ్రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విషయాన్నీ కూడా కమల్ సోషల మీడియా వేదికగా వెల్లడించారు. అయితే అలా డిశ్చార్జ్ అయ్యారో లేదో ఇలా తాను హోస్ట్ గా చేస్తున్న బుల్లితెర రియాలిటీ షో “బిగ్ బాస్ తమిళ్ 5″లో పాల్గొన్నారు. ఈ వీకెండ్ ఎపిసోడ్ లో ఆయన కన్పించడం గమనార్హం. కరోనా తగ్గినప్పటికీ కనీసం వారం రోజులు ఎవరినీ కలవకుండా ఉంటే మంచిదన్న విషయం తెలిసిందే. అయితే ఈ అగ్రహీరో ఆ నిబంధనను పక్కన పెట్టి వెంటనే షూటింగ్ లో పాల్గొనడంపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాజాగా నోటీసులు జారీ చేసింది. కాగా కమల్ కోలుకునే వరకు ఈ షోను సీనియర్ నటి రమ్యకృష్ణ హోస్ట్ చేసింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!