John Abraham : ‘అటాక్’ చేయలేకపోయాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు శృంగభంగమైంది! అతని తాజా చిత్రం ‘అటాక్’ బాక్సాఫీస్ బరిలో అటాక్ చేయలేకపోయింది. పేట్రియాటిజం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ మూవీలో జాన్ అబ్రహంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, ప్రకాశ్ రాజ్, రజిత్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లక్ష్య రాజ్ ఆనంద్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సినిమా మేకింగ్ పరంగా ‘అటాక్’కు మంచి గుర్తింపే వచ్చినా ఓపెనింగ్ రోజు పెద్దంత బజ్ ను క్రియేట్ చేయడంలో విఫలమైంది. దాంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమా కేవలం రూ. 3.51 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి శని, ఆదివారాలలో ఏమైనా బెటర్ మెంట్ ఉంటుందేమో చూడాలి.
Read Also : Tiger Nageswara Rao : వేట మొదలైంది… స్టన్నింగ్ ప్రీ లుక్
Also Read
- Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
- Venkata Satish Kilaru: 60% మేకింగ్.. 40% రెమ్యూనరేషన్.. రామ్ చరణ్ 'పెద్ది' సినిమా బడ్జెట్ లెక్కలివే!
- Vijay Deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. రష్మికతో కలిసి సొంత ఊరిలో 180 మంది విద్యార్థులకు ‘పెళ్లి కానుక’!
- Ram Charan: ఈ కాంబో సెట్ అయితే థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. రామ్ చరణ్ - శ్రీకాంత్ ఓదెల మూవీపై క్రేజీ బజ్!
ఇదిలా ఉంటే… ‘అటాక్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్ అబ్రహం దక్షిణాది చిత్రాలపై ముఖ్యంగా తెలుగు సినిమాలపై తగదునమ్మా అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘సాలార్’ చిత్రంలో నటిస్తున్నారా? అని అడిగిన ఓ ప్రశ్నకు అవుననో, కాదనో సమాధానం చెప్పకుండా ‘నేను హిందీ నటుడిని, ఆ భాషా చిత్రాలే చేస్తాను. డబ్బుల కోసం కొందరి మాదిరి ప్రాంతీయ భాషా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోగా నటించను’ అని అన్నాడు. జాన్ అబ్రహం ఈ మాటలు తన గురించే చెప్పినా, ప్రాంతీయ భాషా చిత్రాలలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్స్ అభిమానులను ఈ వ్యాఖ్యలు చాలా హర్ట్ చేశాయి. ఎందుకంటే అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరో ‘ట్రిపుల్ ఆర్’లో కీలక పాత్ర పోషిస్తే, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి వారు త్వరలో విడుదల కాబోతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో నటించారు. ఆ రకంగా ఉత్తరాదిలోని స్టార్స్ ఫ్యాన్స్ తో జాన్ అబ్రహం గొడవ పెట్టుకున్నట్టు అయ్యింది. అది ‘అటాక్’ మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపించిందని చెప్పలేం కానీ, ‘ట్రిపుల్ ఆర్’ హంగామా ఇంకా ఉత్తరాదిన కొనసాగుతుండటంతో జనం ‘అటాక్’ను పట్టణాల్లోనే కాదు మెట్రో సిటీస్ లోనూ పట్టించుకోలేదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? వాస్తు ప్రకారం కారణం ఈ అమరికలేనా?
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!