John Abraham : ‘అటాక్’ చేయలేకపోయాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు శృంగభంగమైంది! అతని తాజా చిత్రం ‘అటాక్’ బాక్సాఫీస్ బరిలో అటాక్ చేయలేకపోయింది. పేట్రియాటిజం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ మూవీలో జాన్ అబ్రహంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, ప్రకాశ్ రాజ్, రజిత్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లక్ష్య రాజ్ ఆనంద్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సినిమా మేకింగ్ పరంగా ‘అటాక్’కు మంచి గుర్తింపే వచ్చినా ఓపెనింగ్ రోజు పెద్దంత బజ్ ను క్రియేట్ చేయడంలో విఫలమైంది. దాంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమా కేవలం రూ. 3.51 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి శని, ఆదివారాలలో ఏమైనా బెటర్ మెంట్ ఉంటుందేమో చూడాలి.
Read Also : Tiger Nageswara Rao : వేట మొదలైంది… స్టన్నింగ్ ప్రీ లుక్
Also Read
- Indian Movies: ఇండియన్ సినీ హిస్టరీని షేక్ చేసిన అత్యంత ఖరీదైన సినిమాలు ఇవే!
- Janhvi Kapoor: 'రాకా'లో జాన్వీ కపూర్ ఎంట్రీ?.. వైరల్ ఫొటోతో మొదలైన కొత్త రచ్చ!
- Secret Soldier : టైటిల్ మారింది.. 'సీక్రెట్ సోల్జర్'గా వస్తున్న 'చైనా పీస్'!
- Shah Rukh Khan: ‘కింగ్’ నిర్మాతలపై కాసుల వర్షం.. మ్యూజిక్ రైట్స్తోనే సరికొత్త చరిత్ర!
ఇదిలా ఉంటే… ‘అటాక్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్ అబ్రహం దక్షిణాది చిత్రాలపై ముఖ్యంగా తెలుగు సినిమాలపై తగదునమ్మా అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘సాలార్’ చిత్రంలో నటిస్తున్నారా? అని అడిగిన ఓ ప్రశ్నకు అవుననో, కాదనో సమాధానం చెప్పకుండా ‘నేను హిందీ నటుడిని, ఆ భాషా చిత్రాలే చేస్తాను. డబ్బుల కోసం కొందరి మాదిరి ప్రాంతీయ భాషా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోగా నటించను’ అని అన్నాడు. జాన్ అబ్రహం ఈ మాటలు తన గురించే చెప్పినా, ప్రాంతీయ భాషా చిత్రాలలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్స్ అభిమానులను ఈ వ్యాఖ్యలు చాలా హర్ట్ చేశాయి. ఎందుకంటే అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరో ‘ట్రిపుల్ ఆర్’లో కీలక పాత్ర పోషిస్తే, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి వారు త్వరలో విడుదల కాబోతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో నటించారు. ఆ రకంగా ఉత్తరాదిలోని స్టార్స్ ఫ్యాన్స్ తో జాన్ అబ్రహం గొడవ పెట్టుకున్నట్టు అయ్యింది. అది ‘అటాక్’ మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపించిందని చెప్పలేం కానీ, ‘ట్రిపుల్ ఆర్’ హంగామా ఇంకా ఉత్తరాదిన కొనసాగుతుండటంతో జనం ‘అటాక్’ను పట్టణాల్లోనే కాదు మెట్రో సిటీస్ లోనూ పట్టించుకోలేదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
SRSP Project Update: ఎస్సారెస్పీపై ఉత్తమ్ కీలక ప్రకటన.. రైతులకు గుడ్న్యూస్.?
-
Local Elections In AP: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆగస్టు 6న సమావేశం..
-
Kulgam: కుల్గామ్లో పహల్గామ్ సీన్ రిపీట్.. హిందువులు లక్ష్యంగా ఉగ్ర దాడి!
-
Anupama: బ్యాడ్ డేస్ ని అసలు మాటల్లో చెప్పలేను!
-
Godavari River: ఉధృతంగా గోదావరి ప్రవాహం.. ఆ తీరప్రాంత వాసుల్లో భయాందోళనలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!