John Abraham : ‘అటాక్’ చేయలేకపోయాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు శృంగభంగమైంది! అతని తాజా చిత్రం ‘అటాక్’ బాక్సాఫీస్ బరిలో అటాక్ చేయలేకపోయింది. పేట్రియాటిజం బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకున్న ఈ సైంటిఫిక్ యాక్షన్ మూవీలో జాన్ అబ్రహంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, జాక్విలిన్ ఫెర్నాండేజ్, ప్రకాశ్ రాజ్, రజిత్ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లక్ష్య రాజ్ ఆనంద్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. సినిమా మేకింగ్ పరంగా ‘అటాక్’కు మంచి గుర్తింపే వచ్చినా ఓపెనింగ్ రోజు పెద్దంత బజ్ ను క్రియేట్ చేయడంలో విఫలమైంది. దాంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమా కేవలం రూ. 3.51 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి శని, ఆదివారాలలో ఏమైనా బెటర్ మెంట్ ఉంటుందేమో చూడాలి.
Read Also : Tiger Nageswara Rao : వేట మొదలైంది… స్టన్నింగ్ ప్రీ లుక్
Also Read
- Romanchakam Glimpse: జానకి చెంతనే రాముడి హృదయం.. సందీప్ వంగా 'రోమాంచకం' గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ ఉందిగా!
- Akhil Akkineni: రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్పై కన్నేసిన అఖిల్ అక్కినేని.. మైండ్లో పెద్ద స్కెచ్చే ఉందిగా!
- Naga Vamsi: పర్సంటేజ్ సిస్టమ్ వెనుక కుట్ర! థియేటర్ల మోసాలను బయటపెట్టిన నిర్మాత నాగవంశీ..
- Jr NTR: థియేటర్లలో గూస్బంప్స్ గ్యారెంటీ.. అఖిల్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్! ఎలాగో తెలుసా?
ఇదిలా ఉంటే… ‘అటాక్’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జాన్ అబ్రహం దక్షిణాది చిత్రాలపై ముఖ్యంగా తెలుగు సినిమాలపై తగదునమ్మా అంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘సాలార్’ చిత్రంలో నటిస్తున్నారా? అని అడిగిన ఓ ప్రశ్నకు అవుననో, కాదనో సమాధానం చెప్పకుండా ‘నేను హిందీ నటుడిని, ఆ భాషా చిత్రాలే చేస్తాను. డబ్బుల కోసం కొందరి మాదిరి ప్రాంతీయ భాషా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోగా నటించను’ అని అన్నాడు. జాన్ అబ్రహం ఈ మాటలు తన గురించే చెప్పినా, ప్రాంతీయ భాషా చిత్రాలలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్స్ అభిమానులను ఈ వ్యాఖ్యలు చాలా హర్ట్ చేశాయి. ఎందుకంటే అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరో ‘ట్రిపుల్ ఆర్’లో కీలక పాత్ర పోషిస్తే, సంజయ్ దత్, రవీనా టాండన్ వంటి వారు త్వరలో విడుదల కాబోతున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో నటించారు. ఆ రకంగా ఉత్తరాదిలోని స్టార్స్ ఫ్యాన్స్ తో జాన్ అబ్రహం గొడవ పెట్టుకున్నట్టు అయ్యింది. అది ‘అటాక్’ మూవీ కలెక్షన్లపై ప్రభావం చూపించిందని చెప్పలేం కానీ, ‘ట్రిపుల్ ఆర్’ హంగామా ఇంకా ఉత్తరాదిన కొనసాగుతుండటంతో జనం ‘అటాక్’ను పట్టణాల్లోనే కాదు మెట్రో సిటీస్ లోనూ పట్టించుకోలేదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Microsoft LayOff: మైక్రోసాఫ్ట్లో భారీ ఉద్యోగాల కోత.. AI కోసం 4,800 మందికి ఉద్వాసన..
-
Nirav Modi: నీరవ్ మోడీ అప్పగింతకు రంగం సిద్ధం! మూసుకున్న న్యాయ మార్గాలు
-
Etela Rajender : హైడ్రాతో రేవంత్ రెడ్డి సర్కార్కు తిప్పలు తప్పవు..
-
Romanchakam Glimpse: జానకి చెంతనే రాముడి హృదయం.. సందీప్ వంగా ‘రోమాంచకం’ గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్ ఉందిగా!
-
Team India: శ్రేయస్ అయ్యర్, వైభవ్ సూర్యవంశీకి డబుల్ ప్రమోషన్.. జింబాబ్వే టూర్కు జట్టు ప్రకటన..
ట్రెండింగ్
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!