Randhir Kapoor : యాభై ఏళ్ళ ‘జవానీ – దివానీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రఖ్యాత నటదర్శకనిర్మాత రాజ్ కపూర్ తొలి నటవారసుడు రణధీర్ కపూర్. 1970లలో రణధీర్ కపూర్ హీరోగా నటించిన కొన్ని చిత్రాలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఆ కోవకు చెందిన చిత్రం ‘జవానీ – దివానీ’. ఈ చిత్రంలో నాయికగా జయబాధురి నటించారు. తరువాతి రోజుల్లో జయబాధురి, తన బోయ్ ఫ్రెండ్ అమితాబ్ బచ్చన్ ను వివాహమాడారు. ఆ పై రాజ్ కపూర్, అమితాబ్ బచ్చన్ కుటుంబాల మధ్య బంధుత్వం కూడా కుదిరింది. అందువల్ల రణధీర్ కపూర్, జయబాధురి జంటగా నటించిన ‘జవానీ – దివానీ’ చిత్రం ఇప్పటికీ ఆ రెండు కుటుంబాలకు ఓ ప్రత్యేకం! 1972 జూలై 14న విడుదలైన ‘జవానీ – దివానీ’ అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఆ యేడాది టాప్ టెన్ హిందీ మూవీస్ లో ఎనిమిదో స్థానం సంపాదించిందీ చిత్రం.
ఇంతకూ ‘జవానీ – దివానీ’ కథ ఏమిటంటే – ఓ ఠాకుర్ దగ్గర రవి ఆనంద్ పనిచేస్తుంటాడు. ఠాకుర్ చెల్లెలు మధు, రవిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. అప్పటి నుంచీ చెల్లెలుతో బంధం తెంచేసుకుంటాడు ఠాకుర్. రవికి విజయ్ ఆనంద్ అనే తమ్ముడు ఉంటాడు. అతను కాలేజ్ లో చదువుతూ నీతా ఠాకుర్ అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. చిత్రంగా ఆ నీతా, ఠాకుర్ కూతురు. నీతాను తన మిత్రుని తనయుడు బెన్నీ సిన్హాకు ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించి ఉంటాడు ఠాకుర్. అందుకు నీతా అంగీకరించదు. తాను విజయ్ ను ప్రేమించానని చెబుతుంది. వివరాలు తెలిసిన తరువాత ఠాకుర్ ససేమిరా అంటాడు. పైగా కాలేజ్ లో తన పలుకుబడి ఉపయోగించి, ఓ పథకం ప్రకారం విజయ్ ని గెంటేయించాలని చూస్తాడు ఠాకుర్. దాంతో విజయ్ మిత్రులు అందరూ కలసి కాలేజ్ లో క్లాసులు బహిష్కరిస్తారు. విజయ్ పై వచ్చిన అభియోగం నిజం కాదని, అతడు నీతాను ప్రేమిస్తున్నాడని విద్యార్థులు అంటారు. అదే సమయానికి తండ్రిని ఎదిరించి, నీతా కూడా వచ్చి విజయ్ చెంతన చేరుతుంది. ఇది చూసిన కాలేజ్ ప్రిన్సిపల్, తాను విజయ్, నీతాతో మాట్లాడతానని, మిగిలినవారు క్లాసులకు వెళ్ళాలని చెబుతాడు. తమ్ముడు విజయ్ కాలేజ్ గొడవ తెలుసుకున్న అన్న రవి అక్కడకు వస్తాడు. అదే సమయానికి నీతా తండ్రి ఠాకుర్ కూడా అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఇక నీతా తనకు దక్కదని తెలుసుకున్న బెన్నీ తన గూండాలతో కాలేజ్ స్టూడెంట్స్ పై బాంబులు వేయిస్తాడు. ఆ సమయంలో ఠాకుర్ పై బాంబు పడబోతూండగా, అతడిని రక్షించి, తాను ప్రమాదానికి గురవుతాడు రవి. బెన్నీకి బడితపూజ చేస్తాడు విజయ్. బెన్నీని పోలీసులు పట్టుకుపోతారు. ఆసుపత్రిలో రవిని ఎలాగైనా రక్షించమని ఠాకుర్ డాక్టర్ ను కోరతాడు. అక్కడ అతడిని చూసిన ఠాకుర్ చెల్లెలు మధు అతనే అలా చేయించాడని తూలనాడుతుంది. డాక్టర్ ప్రమాదం లేదని, వెళ్ళి చూడవచ్చునని చెబుతాడు. ఠాకుర్ తన తప్పు తెలుసుకొని విజయ్, నీతాను కలుపుతాడు. అతని చెల్లెలు మధు, రవి కూడా ఆనందిస్తారు. అలా కథ సుఖాంతమవుతుంది.
Also Read
- ‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
- Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
- Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
- Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
ఇందులో రవి ఆనంద్ గా బలరాజ్ సహానీ, ఆయన భార్య మధుగా నిరూపరాయ్, ఠాకుర్ గా ఇఫ్తేకార్ నటించారు. మిగిలిన పాత్రల్లో ఎ.కె.హంగల్, నరేంద్రనాథ్, పైంటాల్, సత్యేంద్ర కపూర్, జగ్దిష్ రాజ్, విజు ఖోటే కనిపించారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత ఇందర్ రాజ్ ఆనంద్ తో కలసి తరువాతి రోజుల్లో నటరచయితగా సుప్రసిద్ధుడైన ఖాదర్ ఖాన్ రచన చేశారు. ఖాదర్ ఖాన్ కు ఇదే రచయితగా తొలి చిత్రం కావడం విశేషం! ఇక ‘గుడ్డి’లో ముద్దుగా మురిపించిన జయబాధురి, ఈ సినిమాతోనే గ్లామర్ గానూ కనిపించి అలరించారు. రమేశ్ బెహల్ నిర్మించిన ఈ చిత్రానికి నరేందర్ బేడీ దర్శకత్వం వహించారు. నరేందర్ బేడీకి దర్శకునిగా ఇది రెండో సినిమా. అంతకు ముందు రాజేశ్ ఖన్నాతో బేడీ తెరకెక్కించిన ‘బంధన్’ అలరించింది. ఆ తరువాత “దిల్ దీవానా, ఖోటే సిక్కే, బేనామ్, రఫూ చక్కర్, మహా చోర్, అదాలత్, కచ్చే హీరో, సనమ్ తేరీ కసమ్, ఆఖరీ సంఘర్ష్” వంటి చిత్రాలను ఆయన రూపొందించారు.
‘జవానీ – దివానీ’ విజయానికి అసలు కారకులు సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ అనే చెప్పాలి. అప్పట్లో యువతను కిర్రెక్కిస్తూ ఆయన స్వరపరచిన పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ‘జవానీ – దివానీ’ కోసం ఆనంద్ బక్షీ రాసిన పాటలకు ఆర్డీ బాణీలు భలేగా జోడీ కుదిరాయి. ఇందులోని “సామ్నే ఏ కౌన్ ఆయా…”, “యే జావనీ హై దివానీ…”, “జానే జా డూండ్తా ఫిర్ రహా హూ…” , “అగర్ సాజ్ ఛేడా…”, “నహి నహి… అభి నహి…”, “హే తౌబా…” అంటూ సాగే పాటలు అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని “యే జవానీ హై దివానీ…” పాట ఆ రోజుల్లో ఎంతోమంది గళాల్లో చిందులు వేసింది. అదే టైటిల్ గా రణధీర్ కపూర్ తమ్ముడు రిషి కపూర్ తనయడు రణబీర్ హీరోగా సినిమా రూపొంది ఘనవిజయం సాధించడం విశేషం!
‘జవానీ- దివానీ’కి కాసిన్ని మార్పులూ చేర్పులూ చేసి ‘మంత్రిగారి వియ్యంకుడు’ రూపొందింది. ఇక ‘జవానీ- దివానీ’ కథతోనే 19 ఏళ్ళ తరువాత కన్నడలో శివరాజ్ కుమార్ హీరోగా ‘అరళిద హువుగళు’ అనే సినిమా తెరకెక్కింది.
తాజావార్తలు
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్మన్, గిల్క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
-
Meloni-Trump: ట్రంప్తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!