‘టక్ జగదీశ్’ను పోస్ట్ పోన్ చేయాలంటున్న ఎగ్జిబిటర్స్!
సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్న ‘లవ్ స్టోరీ’కి పోటీగా నాని ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఖండించారు. కొద్ది వారాల క్రితమే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కోరింది. కానీ ఆ విజ్ఞప్తిని పక్కన పెట్టి నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేయడంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే ‘టక్ జగదీశ్’ను కావాలని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటోందని ఆరోపించారు. హీరో నాని, నిర్మాతలు ఈ విషయంలో చొరవ చూపి, అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులతో మాట్లాడి, తమ చిత్రాన్ని మూడు, నాలుగు రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయించాలని కోరారు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోకపోతే… భవిష్యత్తులో ఎగ్జిబిటర్స్ తీసుకునే కఠిన నిర్ణయాలకు నిర్మాతలు ఇబ్బంది పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓటీటీ సంస్థలు థియేటర్లను మూసివేసే విధంగా ప్రవర్తిస్తున్నాయని, ఒకసారి అలా జరిగిన తర్వాత నిర్మాతలను తమ ఉక్కు పిడికిలిలోకి తీసుకుని ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమని, ఈ వాస్తవాన్ని నిర్మాతలు గ్రహించాలని వారు కోరారు.
Read Also : తగ్గేదే లే… “దాక్కో దాక్కో మేక” సాంగ్ కు భారీ వ్యూస్
Also Read
- Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
- JD Chakravarthy: "అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!" జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
- Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
- Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ, ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ మాట్లాడుతూ, ‘నిజానికి ఇది తమ ‘లవ్ స్టోరీ – టక్ జగదీశ్’ చిత్రాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, ప్రతి నిర్మాత సమస్య’ అని అన్నారు. ‘ఒక సినిమా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి థియేటర్లలో విడుదల అవుతుంటే, అదే రోజున మరో సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. నిర్మాతలను ఇలా ఇబ్బంది పెట్టే బదులు నాలుగు రోజుల తర్వాత ‘టక్ జగదీశ్’ను ఓటీటీలో విడుదల చేస్తే జరిగే నష్టం ఏమిటని?’ ప్రశ్నించారు. ‘ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద సినిమాలు పండగ సమయంలో విడుదలవుతున్నప్పుడే ఓటీటీ సంస్థలు తమ దగ్గర ఉన్న సినిమాలను పోటీకి విడుదల చేస్తాయని, అప్పుడు నిర్మాతలకు ఎంత నష్టం వాటిల్లుతుందో ఆలోచించాల’ని అన్నారు. సినిమాలను ఓటీటీలో విడుదల చేయకుండా ఆపలేమని, కాకపోతే పండగల సమయంలో మాత్రం ఓటీటీ కంపెనీలు సినిమాలను స్ట్రీమింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ‘జెమిని’ కిరణ్ కోరారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, విజయేందర్ రెడ్డి తదితరులు తమ అభిప్రాయాలను తెలియచేశారు. మరి ఈ విషయంలో ‘టక్ జగదీశ్’ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో