‘టక్ జగదీశ్’ను పోస్ట్ పోన్ చేయాలంటున్న ఎగ్జిబిటర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్న ‘లవ్ స్టోరీ’కి పోటీగా నాని ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఖండించారు. కొద్ది వారాల క్రితమే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కోరింది. కానీ ఆ విజ్ఞప్తిని పక్కన పెట్టి నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేయడంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే ‘టక్ జగదీశ్’ను కావాలని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటోందని ఆరోపించారు. హీరో నాని, నిర్మాతలు ఈ విషయంలో చొరవ చూపి, అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులతో మాట్లాడి, తమ చిత్రాన్ని మూడు, నాలుగు రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయించాలని కోరారు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోకపోతే… భవిష్యత్తులో ఎగ్జిబిటర్స్ తీసుకునే కఠిన నిర్ణయాలకు నిర్మాతలు ఇబ్బంది పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓటీటీ సంస్థలు థియేటర్లను మూసివేసే విధంగా ప్రవర్తిస్తున్నాయని, ఒకసారి అలా జరిగిన తర్వాత నిర్మాతలను తమ ఉక్కు పిడికిలిలోకి తీసుకుని ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమని, ఈ వాస్తవాన్ని నిర్మాతలు గ్రహించాలని వారు కోరారు.
Read Also : తగ్గేదే లే… “దాక్కో దాక్కో మేక” సాంగ్ కు భారీ వ్యూస్
Also Read
- Peddi Censor Review : 'రంగస్థలం'ను మించిన యాక్టింగ్.... లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
- Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- He-Man: ‘హీ-మ్యాన్’గా యంగ్ హీరో నిఖిల్.. దద్దరిల్లుతున్న ట్రైలర్!
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ, ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ మాట్లాడుతూ, ‘నిజానికి ఇది తమ ‘లవ్ స్టోరీ – టక్ జగదీశ్’ చిత్రాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, ప్రతి నిర్మాత సమస్య’ అని అన్నారు. ‘ఒక సినిమా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి థియేటర్లలో విడుదల అవుతుంటే, అదే రోజున మరో సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. నిర్మాతలను ఇలా ఇబ్బంది పెట్టే బదులు నాలుగు రోజుల తర్వాత ‘టక్ జగదీశ్’ను ఓటీటీలో విడుదల చేస్తే జరిగే నష్టం ఏమిటని?’ ప్రశ్నించారు. ‘ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద సినిమాలు పండగ సమయంలో విడుదలవుతున్నప్పుడే ఓటీటీ సంస్థలు తమ దగ్గర ఉన్న సినిమాలను పోటీకి విడుదల చేస్తాయని, అప్పుడు నిర్మాతలకు ఎంత నష్టం వాటిల్లుతుందో ఆలోచించాల’ని అన్నారు. సినిమాలను ఓటీటీలో విడుదల చేయకుండా ఆపలేమని, కాకపోతే పండగల సమయంలో మాత్రం ఓటీటీ కంపెనీలు సినిమాలను స్ట్రీమింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ‘జెమిని’ కిరణ్ కోరారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, విజయేందర్ రెడ్డి తదితరులు తమ అభిప్రాయాలను తెలియచేశారు. మరి ఈ విషయంలో ‘టక్ జగదీశ్’ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!