‘టక్ జగదీశ్’ను పోస్ట్ పోన్ చేయాలంటున్న ఎగ్జిబిటర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 10న విడుదల కాబోతున్న ‘లవ్ స్టోరీ’కి పోటీగా నాని ‘టక్ జగదీశ్’ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఖండించారు. కొద్ది వారాల క్రితమే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ వరకూ సినిమాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కోరింది. కానీ ఆ విజ్ఞప్తిని పక్కన పెట్టి నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాలను విడుదల చేయడంపై తెలంగాణ ఎగ్జిబిటర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ‘లవ్ స్టోరీ’ విడుదల రోజునే ‘టక్ జగదీశ్’ను కావాలని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటోందని ఆరోపించారు. హీరో నాని, నిర్మాతలు ఈ విషయంలో చొరవ చూపి, అమెజాన్ ప్రైమ్ ప్రతినిధులతో మాట్లాడి, తమ చిత్రాన్ని మూడు, నాలుగు రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయించాలని కోరారు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోకపోతే… భవిష్యత్తులో ఎగ్జిబిటర్స్ తీసుకునే కఠిన నిర్ణయాలకు నిర్మాతలు ఇబ్బంది పడాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓటీటీ సంస్థలు థియేటర్లను మూసివేసే విధంగా ప్రవర్తిస్తున్నాయని, ఒకసారి అలా జరిగిన తర్వాత నిర్మాతలను తమ ఉక్కు పిడికిలిలోకి తీసుకుని ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమని, ఈ వాస్తవాన్ని నిర్మాతలు గ్రహించాలని వారు కోరారు.
Read Also : తగ్గేదే లే… “దాక్కో దాక్కో మేక” సాంగ్ కు భారీ వ్యూస్
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ, ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ నారంగ్ మాట్లాడుతూ, ‘నిజానికి ఇది తమ ‘లవ్ స్టోరీ – టక్ జగదీశ్’ చిత్రాలకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, ప్రతి నిర్మాత సమస్య’ అని అన్నారు. ‘ఒక సినిమా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి థియేటర్లలో విడుదల అవుతుంటే, అదే రోజున మరో సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. నిర్మాతలను ఇలా ఇబ్బంది పెట్టే బదులు నాలుగు రోజుల తర్వాత ‘టక్ జగదీశ్’ను ఓటీటీలో విడుదల చేస్తే జరిగే నష్టం ఏమిటని?’ ప్రశ్నించారు. ‘ఇప్పుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద సినిమాలు పండగ సమయంలో విడుదలవుతున్నప్పుడే ఓటీటీ సంస్థలు తమ దగ్గర ఉన్న సినిమాలను పోటీకి విడుదల చేస్తాయని, అప్పుడు నిర్మాతలకు ఎంత నష్టం వాటిల్లుతుందో ఆలోచించాల’ని అన్నారు. సినిమాలను ఓటీటీలో విడుదల చేయకుండా ఆపలేమని, కాకపోతే పండగల సమయంలో మాత్రం ఓటీటీ కంపెనీలు సినిమాలను స్ట్రీమింగ్ చేయకుండా చర్యలు తీసుకోవాలని ‘జెమిని’ కిరణ్ కోరారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, విజయేందర్ రెడ్డి తదితరులు తమ అభిప్రాయాలను తెలియచేశారు. మరి ఈ విషయంలో ‘టక్ జగదీశ్’ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!