యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్”. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పీరియడ్ రొమాంటిక్ డ్రామాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. ‘రాధేశ్యామ్’ విడుదలకు పెద్దగా సమయం లేకపోవడంతో మేకర్స్ మరోమారు ప్రమోషన్స్ షురూ చేశారు. తాజాగా మేకర్స్ “ఈ రాతలే” సాంగ్ ను విడుదల చేశారు. సాంగ్ కి లిరిక్స్ కృష్ణకాంత్ అందించగా, యువన్ శంకర్ రాజా, హరిణి పాడారు.
Read Also : Bheemla Nayak : జగన్ కక్ష సాధింపు చర్య… మూర్ఖత్వం వీడాలంటున్న చంద్రబాబు