Double iSmart: డబుల్ ఇస్మార్ట్ నైజాం వివాదం.. అసలు సంగతి ఏమిటంటే?
- డబుల్ ఇస్మార్ట్ నైజాం వివాదం
- నైజాం ఏరియాలో ఈ సినిమా రిలీజ్ కాకుండా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అనధికార బ్యాన్ విధించే ఆలోచన
- ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double iSmart: డబుల్ ఇస్మార్ట్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఈ సినిమాని సీక్వెల్ గా తెరకెక్కించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్గా ఈ సినిమాని చార్మి నిర్మించారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ వేగం పెంచారు. కొన్ని సాంగ్స్ రిలీజ్ చేస్తే అవన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వివాదం తెర మీదకు వచ్చింది. అదేంటంటే నైజాం ఏరియాలో ఈ సినిమా రిలీజ్ కాకుండా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అనధికార బ్యాన్ విధించే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ఈరోజు ఉదయం మీటింగ్ కూడా జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు. ఈ నేపద్యంలో లైగర్ నష్టాలు పూడ్చకుండా వరంగల్ శీనుకి ఈ సినిమా హక్కులు ఇవ్వకుండా రిలీజ్ చేస్తున్నారు.
Also Read: Chiranjeevi: గద్దర్ అవార్డుల పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. చిరంజీవి కీలక ట్వీట్
Also Read
- Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్గా ప్రకటించిన డైరెక్టర్!
- Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
- Varun Tej: 'బరి'లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
- SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
దీంతో వరంగల్ శీను ప్రమేయంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని అనధికారికంగా బ్యాన్ చేయాలని ఆలోచనతో మీటింగ్ కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీని వెనుక అసలు కారణం ఏమిటనేది ఆరా తీస్తే పూరి కాంపౌండ్ వర్గాల నుంచి కొన్ని ఆసక్తికర వార్తలు తెలిశాయి. అదేమంటే వరంగల్ శీను లైగర్ సినిమా విషయంలో పూరి, చార్మికి కమిట్మెంట్ ఫుల్ ఫిల్ చేయలేదని తెలుస్తోంది. అంటే ఏ రేటుకైతే లైగర్ సినిమాను తాను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చాడో ఆ రేటు పూర్తిగా చెల్లించలేదని చెబుతున్నారు. లైగర్ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లకు బాకీ పడ్డాడని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు ఏమైనా నష్టపోతే అడగాలి కానీ వరంగల్ శీనుకి అడిగే హక్కు లేదని పూరి కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న సమాధానం. నిజానికి ఇదే విషయం మీద పూరి జగన్నాథ్ కూడా ఒకటి రెండు లేఖలు రాశారు. సినిమా అనేది వ్యాపారం అని సినిమాల వల్ల లాభపడినప్పుడు లాభాలు పంచడం లేదు అలాంటప్పుడు నష్టపోయినప్పుడు నష్టాలు తీర్చమని కోరే హక్కు ఎక్కడిది అనే వాదనలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్డ్రాప్లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!