Double iSmart: డబుల్ ఇస్మార్ట్ నైజాం వివాదం.. అసలు సంగతి ఏమిటంటే?
- డబుల్ ఇస్మార్ట్ నైజాం వివాదం
- నైజాం ఏరియాలో ఈ సినిమా రిలీజ్ కాకుండా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అనధికార బ్యాన్ విధించే ఆలోచన
- ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double iSmart: డబుల్ ఇస్మార్ట్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో సూపర్ హిట్గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ఈ సినిమాని సీక్వెల్ గా తెరకెక్కించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్గా ఈ సినిమాని చార్మి నిర్మించారు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ వేగం పెంచారు. కొన్ని సాంగ్స్ రిలీజ్ చేస్తే అవన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వివాదం తెర మీదకు వచ్చింది. అదేంటంటే నైజాం ఏరియాలో ఈ సినిమా రిలీజ్ కాకుండా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అనధికార బ్యాన్ విధించే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ లో ఈరోజు ఉదయం మీటింగ్ కూడా జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు. ఈ నేపద్యంలో లైగర్ నష్టాలు పూడ్చకుండా వరంగల్ శీనుకి ఈ సినిమా హక్కులు ఇవ్వకుండా రిలీజ్ చేస్తున్నారు.
Also Read: Chiranjeevi: గద్దర్ అవార్డుల పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. చిరంజీవి కీలక ట్వీట్
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్ఫుత్ క్యారెక్టర్పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
దీంతో వరంగల్ శీను ప్రమేయంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని అనధికారికంగా బ్యాన్ చేయాలని ఆలోచనతో మీటింగ్ కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీని వెనుక అసలు కారణం ఏమిటనేది ఆరా తీస్తే పూరి కాంపౌండ్ వర్గాల నుంచి కొన్ని ఆసక్తికర వార్తలు తెలిశాయి. అదేమంటే వరంగల్ శీను లైగర్ సినిమా విషయంలో పూరి, చార్మికి కమిట్మెంట్ ఫుల్ ఫిల్ చేయలేదని తెలుస్తోంది. అంటే ఏ రేటుకైతే లైగర్ సినిమాను తాను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చాడో ఆ రేటు పూర్తిగా చెల్లించలేదని చెబుతున్నారు. లైగర్ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లకు బాకీ పడ్డాడని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్లు ఏమైనా నష్టపోతే అడగాలి కానీ వరంగల్ శీనుకి అడిగే హక్కు లేదని పూరి కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న సమాధానం. నిజానికి ఇదే విషయం మీద పూరి జగన్నాథ్ కూడా ఒకటి రెండు లేఖలు రాశారు. సినిమా అనేది వ్యాపారం అని సినిమాల వల్ల లాభపడినప్పుడు లాభాలు పంచడం లేదు అలాంటప్పుడు నష్టపోయినప్పుడు నష్టాలు తీర్చమని కోరే హక్కు ఎక్కడిది అనే వాదనలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!