టికెట్ రేట్లపై ఎవరూ నోరు విప్పరా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో సినిమా టికెట్ ధరలు ఇటీవల కాలంలో టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఇటీవల సవరించిన జీవోతో టాలీవుడ్ లో పెద్ద సినిమాల మనుగడకు పెద్ద ముప్పు ఏర్పడిందన్నది వాస్తవం. ఇలా అయితే ఇండస్ట్రీ మనుగడ కష్టమేనని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంత మంది దీని వల్ల సినిమాల నిర్మాణ వ్యయం తగ్గి తద్వారా తారలు, సాంకేతిక నిపుణుల పారితోషికాలు కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు ఈ జీవో వర్తింప చేయకుండా ఒక పిరియడ్ తర్వాత అమలు చేస్తే బాగుంటుందని పలువులు సూచిస్తున్నారు. ప్రభుత్వ జీవో కి వ్యతిరేకంగా పెదవి విప్పే సాహసం ఏ హీరోలు, నిర్మాతలు, దర్శకులు, పంపిణీదారులు, ప్రదర్శనదారుల చేయలేకపోతున్నారు.
టికెట్ రేట్ల పెంపుపై మాత్రం కొందరు సి.ఎం. జగన్ సాయం చేయాలంటూ పరిశ్రమ బాగుకు సహకరించాలని అభ్యర్థించారు. ఇటీవల మంత్రి పేర్ని నానీ కూడా ఈ టిక్కెట్ ధరల పెంపు విషయమై సి.ఎం.తో మాట్లాడతానని వ్యాఖ్యానించారు. బెనిఫిట్ షోలు, ఎక్స్ ట్రా షోస్ విషయంలో మాత్రం ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అలాగే ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థకు చిత్రరంగం కూడా అభ్యంతరం వ్యక్తం చేయటం లేదు. అయితే సమయానుకూలంగా టికెట్ ధరల్ని పెంచకపోతే పరిశ్రమ చిక్కుల్లో పడుతుందని చిరంజీవి సహా పలువురు పెద్దలు చెబుతూ ఆ విషయంలో సాయం చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. టికెట్ ధరలు ప్రభుత్వ నిర్ణయం మేరకే కొనసాగితే ఎగ్జిబిషన్ రంగం కోలుకోలేదని, ఏపీలో థియేటర్లు చాలా వరకు మూత పడతాయని చెబుతున్నారు.
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
- MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'మైసా' రిలీజ్ డేట్ లాక్
వచ్చే సంక్రాంతి లోపు దాదాపు రూ.1000 కోట్లకు పైగా విలువ ఉన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆ యా సినిమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే ప్రదర్శించవలసిన పక్షంలో వందలాది కోట్లు నష్టపోవలసి వస్తుంది. అయితే ఈ నష్టం తారలకు కాదు. పంపిణీదారులు, ప్రదర్శనదారులు, కొంత మంది నిర్మాతలది. నటీనటులు ఎంతో కొంత తగ్గించుకున్నా (నిజానికి తగ్గించుకోవటానికి వారు ఇష్టపడరు) నష్టపోవడం మాత్రం గ్యారెంటీ. ఏపీ ప్రభుత్వం చెప్పిన రేట్లు అమలు చేయాలంటే చిత్రపరిశ్రమ సమూలంగా మారాలి. తారలు పారితోషికంగా కొద్దిగా అడ్వాన్స్ తీసుకుని రిలీజ్ తర్వాత లాభాల్లో వాటాలు తీసుకోవాలి.
నిర్మాతలు ముందుగా తమ సొంత సొమ్ముని పెట్టుబడిగా పెట్టి (గోల్డెన్ ఎరాలో లా) సినిమాలు తీయాలి. ఎందుకంటే ప్రస్తుతం 99 శాతం నిర్మాతలు సొంత డబ్బుతో సినిమాలు తీయటం లేదు. మంది సొమ్ముతోనే తీస్తున్నారన్నది వాస్తవం. సొంత డబ్బుతో సినిమా తీసేటప్పుడు జాగ్రత్త వస్తుంది. వేస్ట్ ఖర్చులు ఉండవు. అదనపు ఖర్చులు కూడా తగ్గుతాయి. కథలను కూడా బడ్జెట్ తగ్గట్లు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. మరి ఇదంతా జరుగుతుందా!? అంటే నిస్సందేహంగా జరగదు అనే చెప్పాలి. ఎందుకంటే మార్పు అంత తొందరగా రాదు. మరి ఈ టికెట్ రేటు విషయంలో మన స్టార్స్, స్టార్ డైరెక్టర్స్, నిర్మాతలు మూకుమ్మడిగా గొంతు విప్పుతారా? లేక పిల్లి మెడలో గంట కట్టేవాడి కోసం ఎదురు చూస్తూ కాలం వెళ్ళదీస్తారా!? లెట్స్ వెయిట్ అండ్ సీ.
తాజావార్తలు
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంట్లో విషాదం.. మేనకోడలు ఆత్మహత్య
-
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
-
AV Ranganath: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఊరట.. సింగిల్ బెంచ్ ఉత్తర్వులు సస్పెండ్ చేసిన హైకోర్టు..
-
SCO Summit 2026: సింధు జలాల ఒప్పందంపై షాబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!