లతా మంగేష్కర్ చివరి పాట ఏంటో తెలుసా ?
స్వర కోకిల లతా మంగేష్కర్ ఈరోజు కన్నుమూశారు. లత మృతితో యావత్ సంగీత ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. స్వర కోకిలగా పేరుగాంచిన భారతరత్న గ్రహీత, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తన కెరీర్లో వేలాది పాటలకు గాత్రాన్ని అందించారు. లతా అనేక భారతీయ భాషలలో పాటలు పాడారు. ఆమె పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే లత చివరి పాట ఏదో తెలుసా?
Read Also : లతాజీకి బాలీవుడ్ ప్రముఖుల నివాళి
Also Read
లతా మంగేష్కర్ చాలా హిందీ పాటలకు ఆమె మధురమైన గాత్రాన్ని అందించారు. లతా మంగేష్కర్ దాదాపు 36 భారతీయ భాషల్లో 40 వేలకు పైగా పాటలకు తన గాత్రాన్ని అందించారు. చివరగా విడుదలైన లతా మంగేష్కర్ పాట విషయానికొస్తే అది మయూరేష్ పాయ్ స్వరపరచిన ‘సౌగంధ్ ముఝే ఈజ్ మిట్టి కి’. ఈ పాట 30 మార్చి 2019న విడుదలైంది. ఆమె చివరి సినిమా పాట 2006 సంవత్సరంలో విడుదలైన ‘రంగ్ దే బసంతి’లోని ‘లుకా చుప్పి’ పాట. ఈ పాటను ఏఆర్ రెహమాన్ స్వరపరిచారు. లతా మంగేష్కర్ చివరి హిందీ ఆల్బమ్ 2004లో విడుదలైన ‘వీర్-జారా’ చిత్రం. లతా మంగేష్కర్ పాడిన చాలా పాటలు ఇంకా విడుదల కాలేదు. సంగీత స్వరకర్త, దర్శకుడు, నిర్మాత విశాల్ భరద్వాజ్ సెప్టెంబర్ 2021లో లతా మంగేష్కర్ పుట్టినరోజు సందర్భంగా ఓ సాంగ్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే లతా చివరి సాంగ్.
తాజావార్తలు
-
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
-
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!