Vassishta: ‘రూటు’ మార్చిన బాలయ్య.. మోక్షజ్ఞ కథ పక్కన పెట్టి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడుగా చేసింది రెండు సినిమాలు, అందులో ఒకటి రిలీజ్ అయి హిట్ అవ్వగా రెండోది ఎప్పుడు వస్తుందో తెలియదు, అయినా వశిష్ట ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా మారిపోయారు. ‘బింబిసార’తో తన టేకింగ్ ఏంటో నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ వంటి భారీ సోషియో ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే, వశిష్ట కెరీర్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన కొడుకుల కోసం కథలు రాసుకుంటే, అవే కథలు తండ్రుల సినిమాల వైపు నడిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎంతో మంది డైరెక్టర్లు మోక్షజ్ఞ కోసం కధలు రాసుకొన్నారు. అలానే మోక్షజ్ఞ డెబ్యూ కోసం వశిష్ట ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు. బాలకృష్ణకు కూడా ఆ కథ నచ్చడంతో ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందని అందరూ భావించారు కానీ, లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మోక్షజ్ఞ ప్రాజెక్టును ప్రస్తుతానికి పక్కన పెట్టి, అదే వశిష్ట దర్శకత్వంలో బాలకృష్ణ స్వయంగా ఓ సినిమా చేయబోతున్నారట.
Also Read :Ek Din: సాయి పల్లవి ‘ఏక్ దిన్’ ట్రైలర్.. ఒక్క రోజు ప్రేమ కోసం హీరో పోరాటం!
Also Read
- Toxic Advance Booking: యష్ ‘టాక్సిక్’కు కౌంట్డౌన్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?
- Mohanlal: కుర్ర హీరోలకే షాకిచ్చేలా .. ఒకేసారి 7 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు అనౌన్స్ చేసిన లెజెండరీ హీరో!
- Prabhas-Hanu Raghavapudi: ‘ఫౌజీ’తో ఆగదట.. హను రాఘవపూడితో ప్రభాస్ మరోసారి జతకట్టనున్నాడా?
- Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన 'విశ్వనాథ్ & సన్స్'!
బాలయ్యకు వశిష్ట చెప్పిన మరో లైన్ విపరీతంగా నచ్చడంతో, ఈ ‘నటసింహం’ ప్రాజెక్ట్ ముందుగా టేకాఫ్ కాబోతోందని సమాచారం. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ ప్రయాణం కూడా ఇలాగే మొదలైంది. మొదట వశిష్ట ఓ కథను రామ్ చరణ్ కోసం రాసుకున్నారు. చరణ్కు కూడా కథ బాగా నచ్చింది. కానీ ఆ డిస్కషన్స్ జరుగుతున్న సమయంలోనే చిరంజీవికి ఒక లైన్ చెప్పడం, అది కాస్తా ‘విశ్వంభర’గా మారి పట్టాలెక్కడం జరిగిపోయాయి. అలా చరణ్ చేయాల్సిన ప్రయాణంలోకి చిరు వచ్చారు. వశిష్ట శైలి, ఆయన విజువలైజేషన్ సీనియర్ స్టార్ హీరోలకు బాగా కనెక్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అలా రామ్ చరణ్ కోసం అనుకుంటే.. మెగాస్టార్ చిరంజీవి ప్రాజెక్ట్ ఓకే అయ్యింది, మోక్షజ్ఞ కోసం అనుకుంటే.. ఇప్పుడు బాలయ్య ప్రాజెక్ట్ లైన్లోకి వచ్చింది. మొత్తానికి వశిష్ట రాసుకున్న కథలు వారసుల కంటే ముందుగా వాళ్ల తండ్రులను మెప్పిస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక క్రేజీ ‘సెంటిమెంట్’గా మారిపోయింది.
తాజావార్తలు
-
Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..
-
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
-
Devdutt Padikkal: నా అద్భుత ప్రదర్శనకు కారణం ఇదే.. పడిక్కల్ సీక్రెట్ టెక్నిక్ రివీల్..
-
Toxic Advance Booking: యష్ ‘టాక్సిక్’కు కౌంట్డౌన్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచంటే?
-
David Warner: మూడు గ్లాసుల మందు… కుటుంబంతో ప్రయాణం.. స్టార్ క్రికెటర్కు కోర్టు ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్..
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!