పెద్ది సినిమాలో జాన్వీ పాత్ర చుట్టూ అల్లుకున్న వివాదం మీద దర్శకురాలు నందిని రెడ్డి స్పందించారు. తాజాగా మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆమె ఈ విషయం మీద మాట్లాడుతూ ఆడియన్స్ ఇస్ చేంజింగ్, అది మీరు గమనించాలి. ఆడియన్స్ అంత ఫాస్ట్ గా ఇవాల్వ్ అవుతున్నారు. “మనం అదే తీద్దాము, మనం ఎప్పటి నుంచో తీసాము, వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి” అంటే అది మీ ఇష్టం, బట్ దిస్.. ఇది వాట్ఎవర్ హాపెన్డ్, రియాక్షన్ వాస్ ఆర్గానిక్ ఫ్రమ్ పీపుల్. సో అది, యస్ ఫిలిం మేకర్స్ మనం ఎప్పుడు సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తామండి. వర్.. “సినిమా ఇస్ మిర్రర్ ఆఫ్ సొసైటీ” అంటారు.
సో మనము జనాలు ఏమంటున్నారు, ఏమనుకుంటున్నారు అనేది మనం ఎప్పుడు అవేర్ గా ఉండాలి, కనెక్టెడ్ గా ఉండాలి. ప్రతిదానికి ఇప్పుడు అదనే కాదు, జనానికి ఇప్పుడు ప్లాట్ఫార్మ్ ఉందండి రియాక్ట్ అవ్వడానికి. ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే అంత అప్పుడు అంత ప్లాట్ఫామ్స్ లేవు, ఇప్పుడు ఉన్నాయి, రియాక్ట్ అవుతున్నారు, వాడతారు కదా? ఇప్పుడు అందరూ కంటెంట్ క్రియేటర్లే. ఈ అంశం మీద బుచ్చిబాబు కూడా స్పందించారు, తప్పు ఎక్సెప్ట్ చేశారు, సారీ చెప్పారు, సో హి టుక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దట్ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

