Maruthi: నవతరం మెచ్చిన మారుతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruthi:నవతరం మెచ్చే చిత్రాలను తీస్తూ, తనదైన బాణీ పలికించారు దర్శకుడు మారుతి. కేవలం దర్శకునిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా మారుతి సక్సెస్ రూటులో సాగారు. యువతను ఆకట్టుకొనే అంశాలను చొప్పించి, జనాన్ని మెప్పించడంలో మేటిగా నిలిచారు మారుతి.
మచిలీపట్నంలో 1973 అక్టోబర్ 8న దాసరి మారుతి జన్మించారు. బందరులోనే విద్యాభ్యాసం సాగింది. హైదరాబాద్ కు వచ్చి యానిమేషన్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. తరువాత వెహికల్స్ కు సైన్ బోర్డ్స్, నంబర్ ప్లేట్స్ చేస్తూ జీవనం సాగించారు. చదువుకొనే రోజుల నుంచీ సినిమాలపై ఆసక్తి ఉంది. దాంతో చిత్రసీమవైపు కూడా పయనం సాగించాలని తపించారు. తమిళంలో విజయం సాధించిన ‘కాదల్’ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమిస్తే’ పేరుతో మిత్రులతో కలసి అనువదించారు మారుతి. ఆ సినిమా మంచి విజయం సాధించింది. రామ్ గోపాల్ వర్మ 5డి కెమెరాతో లో బడ్జెట్ మూవీగా ‘దొంగలముఠా’ చిత్రాన్ని తెరకెక్కించారు. దానిని చూసిన తరువాత తక్కువ పెట్టుబడితో చిత్రాలు నిర్మించవచ్చు అనే నమ్మకం మారుతికి కూడా కలిగింది. బడ్జెట్ కు తగ్గ కథను తయారు చేసుకున్నారు. దానినే ‘ఈ రోజుల్లో’ అనే చిత్రంగా తెరకెక్కించారు మారుతి. యాభై లక్షల్లో రూపొందిన ‘ఈ రోజుల్లో’ సక్సెస్ సాధించింది. తరువాత కుర్రకారుకు కిర్రెక్కిస్తూ ‘బస్టాప్’ తెరకెక్కించారు మారుతి. అది కూడా ఆకట్టుకుంది.
Also Read
- The Odyssey: 'ది ఒడిస్సీ' ప్రీ రివ్యూ ..
- The Odyssey: రిలీజ్కు ముందే సెన్సేషన్.. హాట్కేకుల్లా అమ్ముడవుతున్న 'ది ఒడిస్సీ' టికెట్లు! లక్షకు పైగా..
- Kiran Abbavaram: 'మా తమిళోల్లు మీ సినిమాలు చూడరు..' ఉన్న విషయం చెప్పిన హీరో కిరణ్ అబ్బవరం
- Vallabhaneni Anil: చిరంజీవి చెప్పిన మాటతో కదిలిన ఫెడరేషన్.. డ్యాన్స్ మాస్టర్స్ గొడవకు ఫుల్ స్టాప్?
‘ప్రేమకథా చిత్రం’ కథను రాసి, ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించారు మారుతి. అది అనూహ్య విజయం సాధించింది. తరువాత యువతనే లక్ష్యంగా చేసుకొని “రొమాన్స్, లవ్ యూ బంగారం, గ్రీన్ సిగ్నల్, లవర్స్” వంటి చిత్రాలను నిర్మించారు. అల్లు శిరీష్ హీరోగా ‘కొత్త జంట’ చిత్రానికి దర్శకత్వం వహించారు. మారుతి లోని టాలెంట్ చూసిన అల్లు అరవింద్ మరో అవకాశం కల్పించారు. తత్ఫలితంగా ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం రూపొందింది. ఈ సినిమా దర్శకునిగా మారుతికి మరింత పేరు తెచ్చింది. వెంకటేశ్ హీరోగా ‘బాబు బంగారం’ రూపొందించారు మారుతి. శర్వానంద్ తో ‘మహానుభావుడు’, నాగచైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’, సాయిధరమ్ తేజ్ తో ‘ప్రతిరోజూ పండగే’ వంటి చిత్రాలను తెరకెక్కించారు మారుతి. సంతోష్ శోభన్ తో ‘మంచిరోజులు వచ్చాయి’ అనే సినిమా రూపొందించారు. గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ రెండు సినిమాలు అంతగా అలరించలేక పోయాయి. ఈ సారి మళ్ళీ తనదైన బాణీ పలికిస్తూ మారుతి ఏ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
-
Parliament Monsoon Session: ‘వందే మాతరం’ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!