Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devool Band 2: సినిమా హిట్ అయితే సాధారణంగా బాక్సాఫీస్ కలెక్షన్లు, రికార్డులు, లాభాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఒక సినిమా సాధించిన విజయాన్ని సమాజానికి తిరిగి అందించాలనే ఆలోచనతో ముందుకు సాగితే, ఆ విజయం మరింత ప్రత్యేకంగా మారుతుంది. ప్రస్తుతం మరాఠీ చిత్రం ‘దేవూల్ బంద్ 2’ విషయంలో ఇదే జరుగుతోంది. కేవలం 8 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్ల మార్కును దాటింది. అంతేకాదు సినిమా నిర్మాణానికి అయిన ఖర్చును మాత్రమే ఉంచుకుని, మిగిలిన లాభాలను రైతు కుటుంబాలకు విరాళంగా ఇవ్వాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ముందు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ చేసిన సాయం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ సినిమాకు షారుఖ్ ఎలా సహాయం చేశారు? రూ.100 కోట్ల విజయాన్ని సాధించిన తర్వాత నిర్మాతలు ఎందుకు లాభాలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు? అనే వివరాల్లోకి వెళ్తే..
‘దేవూల్ బంద్ 2’కు ప్రవీణ్ తార్డే దర్శకత్వం వహించారు. రైతు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తార్డే, తనకు దగ్గరైన అంశాలను కథలో ప్రతిబింబించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2026 మేలో థియేటర్లలోకి వచ్చింది. మోహన్ జోషి, స్నేహల్ తార్డే, మహేష్ మంజ్రేకర్, ప్రసాద్ ఓక్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమా వసూళ్లు వేగంగా పెరిగాయి. చివరకు రూ.100 కోట్ల క్లబ్లోకి చేరి మరాఠీ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక విజయాన్ని నమోదు చేసింది. అయితే ‘దేవూల్ బంద్ 2’ ప్రయాణంలో బాక్సాఫీస్ విజయానికి ముందే ఒక పెద్ద సమస్య ఎదురైంది. సినిమా రిలీజ్ కు సిద్ధమైనప్పటికీ, దాన్ని విస్తృతంగా థియేటర్లలో విడుదల చేయడానికి అవసరమైన డిజిటల్ సినిమా ప్యాకేజీ అంటే డీసీపీ కోసం అదనపు ఖర్చు అవసరమైంది. చిత్రబృందం మొదట సుమారు రూ.12 లక్షల వ్యయాన్ని అంచనా వేసినప్పటికీ, చివరికి ఈ ఖర్చు దాదాపు రూ.42 లక్షలకు చేరుతుందని తేలింది. పరిమిత బడ్జెట్తో రూపొందించిన ప్రాంతీయ చిత్రానికి ఈ మొత్తం భరించడం చాలా కష్టంగా మారింది.
Also Read
- Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
- Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
- Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
- Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
ఈ సమయంలోనే షారుఖ్ ఖాన్ రంగంలోకి వచ్చారు. చిత్రబృందం ఆయనకు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ను సంప్రదించి తమ పరిస్థితిని వివరించింది. సినిమా మరాఠీ చిత్రమని, పరిమిత బడ్జెట్ కారణంగా డీసీపీ ఖర్చును భరించడం తమకు సాధ్యం కావడం లేదని నిర్మాతలు తెలిపారు. ఈ విషయం షారుఖ్ వరకు వెళ్లడంతో ఆయన తన బృందం నుంచి సినిమా గురించి వివరాలు తెలుసుకున్నారు. సినిమా గురించి తెలుసుకున్న తర్వాత షారుఖ్ ఖాన్ తీసుకున్న నిర్ణయం చిత్రబృందానికి ఎంతో ఊరటనిచ్చింది. వారికి సహాయం చేయాలని ఆయన తన బృందానికి సూచించినట్లు ప్రవీణ్ తార్డే తెలిపారు. ఈ ఒక్క నిర్ణయం వల్ల ‘దేవూల్ బంద్ 2’ రిలీజ్ అడ్డంకి తొలగిపోయింది. పెద్ద స్టార్ అయినప్పటికీ, ఒక చిన్న ప్రాంతీయ సినిమాకి అండగా నిలవడం సినీ వర్గాల్లో ప్రత్యేకంగా నిలిచింది.
ఇక సినిమా రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన తర్వాత కూడా మేకర్స్ తీసుకున్న నిర్ణయం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది. సాధారణంగా భారీ వసూళ్లు వచ్చినప్పుడు నిర్మాతలు, పెట్టుబడిదారులు లాభాలను పంచుకుంటారు. కానీ ‘దేవూల్ బంద్ 2’ బృందం మాత్రం సినిమా నిర్మాణానికి అయిన అసలు ఖర్చును మాత్రమే ఉంచుకుని, మిగిలిన లాభాలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా పేదరికం, అప్పుల భారంతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు ఆ మొత్తాన్ని అందించాలని దర్శకుడు ప్రవీణ్ తార్డే, నిర్మాత కైలాష్ వాణి నిర్ణయించినట్లు సమాచారం. సినీ ఇండస్ట్రీలో ఒక ప్రాంతీయ చిత్రం ఇంతటి వసూళ్లు సాధించడం గొప్ప విషయమే. కానీ ఆ విజయాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా మలచడం మరింత అరుదైన విషయం. ‘దేవూల్ బంద్ 2’ ఇప్పుడు కేవలం రూ.100 కోట్ల మరాఠీ సినిమాగా కాకుండా, ఒక సినిమా విజయాన్ని సామాజిక బాధ్యతతో ఎలా అనుసంధానం చేయవచ్చో చూపించే ఉదాహరణగా నిలుస్తోంది.
- Tags
- cinema
- Devool Band 2
తాజావార్తలు
-
Devool Band 2: రూ.8 కోట్ల బడ్జెట్ తో రూ.100 కోట్లు కొల్లగొట్టిన మరాఠీ సినిమా.. లాభాలన్నీ రైతు కుటుంబాలకే ..
-
Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
-
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
-
PM Modi: విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లో కీలక పర్యటన.!
-
GST Bribery Case: లంచం బాగోతం.. రూ.1.50 కోట్లు డిమాండ్.. రూ.40 లక్షలకు ఒప్పందం.. ఇద్దరు GST అధికారులు అరెస్ట్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!