Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Disha Salian Case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా మరణం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2020లో ముంబైలోని ఓ హై రైజ్ భవనం నుంచి కిందపడటంతో దిశా మృతి చెందారు. అప్పట్లో పోలీసులు ఈ ఘటనను ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం కేసులో ఫౌల్ ప్లేకు ఆధారాలు లేవని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అయితే దిశా తండ్రి సతీష్ సాలియన్ మాత్రం తన కుమార్తె మరణంపై అనేక సందేహాలు ఉన్నాయని, ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు దర్యాప్తు తీరుకు సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు లేవనెత్తడంతో ఈ కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
2026 ఆగస్టు 28న జరిగిన విచారణ సందర్భంగా దిశా మృతదేహానికి సంబంధించిన వైద్య, పోలీసు రికార్డులపై కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ముంబై పోలీసుల దర్యాప్తు తీరుపై బొంబాయి హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన తుది తీర్పును రిజర్వ్లో పెట్టింది. 2026 ఆగస్టు 28న జరిగిన విచారణలో భాగంగా, 14వ అంతస్తు నుంచి కిందపడిన వ్యక్తి తల భాగంలో ఎలాంటి ఫ్రాక్చర్లు కాకపోవడం, అలాగే మృతదేహం పడివున్న ప్రదేశంలో రక్తపు మరకలు లేకపోవడంపై న్యాయస్థానం ముంబై పోలీసులను గట్టిగా ప్రశ్నించింది. అంతేకాకుండా, పోలీసుల ఇన్క్వెస్ట్ పంచనామా నివేదికలో మృతదేహంపై దుస్తులు లేవని పేర్కొనగా, ఆసుపత్రి మరియు శవాగారంలో తీసిన ఫోటోలలో మాత్రం దుస్తులు ఉండటంపై కోర్టు తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఒకే ఘటనకు సంబంధించిన అధికారిక రికార్డుల్లో ఇలాంటి తేడాలు ఎందుకు వచ్చాయనే అంశంపై న్యాయస్థానం వివరణ కోరింది.
Also Read
- Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
- Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
- Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ అయిన దిశా సాలిన్ 2020 జూన్ 8న మరణించగా, ముంబై పోలీసులు దీనిని ఆత్మహత్యగా తేల్చి కేసును ముగించారు. అయితే ఆమె తండ్రి సతీష్ సాలిన్ తన కుమార్తెపై అత్యాచారం, హత్య జరిగాయని ఆరోపిస్తూ, ఈ కేసును సీబీఐ (CBI) ద్వారా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు వ్యక్తంచేసిన అనుమానాలతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇప్పటికే జరిగిన దర్యాప్తును సమర్థించారు. సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, కాల్ రికార్డులను పరిశీలించినప్పటికీ ఫౌల్ ప్లేకు ఆధారాలు లభించలేదని వాదించారు. దిశా ప్రియుడు రోహన్ రాయ్ వాంగ్మూలంలో కూడా హత్యకు సంబంధించిన ఆధారాలు లేవని కోర్టుకు వివరించినట్లు సమాచారం.
దిశా సాలియన్ మరణం జరిగిన కొద్ది రోజులకే సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా మృతి చెందడంతో, ఈ రెండు ఘటనల మధ్య సంబంధం ఉందంటూ అప్పట్లో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. మొత్తంగా చూస్తే దిశా సాలియన్ మరణం కేసులో బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు తీరుపై మరోసారి చర్చకు దారితీశాయి. మరి ఈ మరణాల మిస్టరీ ఎప్పుడు వీడుతుందో, అసలు నిజాలు ఎప్పుడు బయటికి వస్తాయో అని ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు.
- Tags
- cinema
- disha salian case
తాజావార్తలు
-
Disha Salian Case: 14వ అంతస్తు నుంచి పడితే గాయాలు ఎందుకు లేవు?.. సుశాంత్ మాజీ మేనేజర్ దిశా కేసులో హైకోర్టు ప్రశ్నలు
-
Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
-
US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!