Stampedes : తొక్కిసలాటలు.. అభిమానుల ప్రాణాలంటే లెక్కలేదా..?
- జాగ్రత్తలు అసలే లేవు
- ఇష్టారీతని సభలు, మీటింగ్ లు
- ఇంత నిర్లక్ష్యమేంటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampedes : తమిళనాడులో ఘోర విషాదం జరిగింది. విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 31 మంది ప్రాణాలు విడిచారు. ఇంకా పదుల కొద్దీ చావుతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. దేశ చరిత్రలో ఓ పొలిటికల్ ఈవెంట్ కు వెళ్లి ఇంత మంది చనిపోవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ నడుమ చాలా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఆర్సీబీ పరేడ్ లో తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. అంతకు ముందు పుష్ప-2 ప్రీమియర్స్ కు వెళ్లి రేవతి అనే మహిళ చనిపోయారు. ఆమె కొడుకు ఇంకా బెడ్ మీద నుంచి లేవట్లేదు.
Read Also : Manchu Manoj : అర్జున్ రెడ్డి సినిమా మిస్ చేసుకున్న మంచు మనోజ్..
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
ఇక సినిమా ఈవెంట్లకు వెళ్లి ఎవరో ఒకరు చనిపోతున్న ఘటనలు లెక్కే లేదు. ఇక్కడ ఓ విషయం మాట్లాడుకోవాలి. తొక్కిసలాట ఎక్కడ జరిగినా సరే.. అక్కడ చనిపోయేది మాత్రం అభిమానులే. సినిమా ఈవెంట్ అయినా.. క్రికెట్ పరేట్ అయినా.. రాజకీయ సభ అయినా సరే.. చనిపోయేది మాత్రం సాధారణ అభిమానులే. హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు అందరూ బాగానే ఉంటారు. చనిపోయేది వాళ్ల కోసం వెళ్లిన సాధారణ ప్రేక్షకులే. ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత మంది వస్తారు.. అసలు అక్కడ అంత పెద్ద సభ ఏర్పాటు చేయొచ్చా లేదా.. పోలీసుల సలహాలు ఏంటి అనేవి పాటించాలి కదా. కానీ ఎవరూ పాటించరు.
తమ బల ప్రదర్శన చూపించుకోవాలి.. దాన్ని మీడియాలో, సోషల్ మీడియాలో హైలెట్ చేసుకోవాలనే తాపత్రయమే తప్ప.. అభిమానులకు ఇబ్బంది అవుతుందనే విషయం కూడా ఆలోచించట్లేదు. ఆర్సీబీ పరేడ్ కు ఎంత మంది వస్తారనే సమాచారం లేకుండానే పరేడ్ నిర్వహించారా.. ఇప్పుడు విజయ్ ఎంత మంది వస్తారనే ఇన్ఫర్మేషన్ లేకుండానే ర్యాలీ చేశారా.. తెలిసి కూడా కావాలనే చేస్తున్నారా. ఇదంతా ఎందుకు చేస్తున్నారు.. ఎవరి కోసం చేస్తున్నారు. అక్కడికేదో దేశానికి సేవ చేస్తున్నంత బిల్డప్ ఇస్తూ ఈవెంట్ లు పెద్ద ఎత్తున నిర్వహించడం అవసరమా. ఆల్రెడీ చాలా తొక్కిసలాటలు జరుగుతున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే ఎలా. అభిమానుల ప్రాణాలంటే మరీ అంత చులకన అయిపోయాయా. కొన్ని సార్లు పోలీసులు వద్దని అలెర్ట్ చేసినా వినట్లేదు. చివరకు పోలీసుల వైఫల్యం అని వాళ్ల మీద నెట్టేయడం కామన్ అయిపోయింది. ఎంత హీరో అయినా.. సెలబ్రిటీ అయినా పెద్ద సభలు పెట్టే ముందు ఆలోచిస్తే బెటర్.
Read Also : K-Ramp : కె-ర్యాంప్ అంటే బూతు కాదు.. అర్థం చెప్పిన డైరెక్టర్
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?