Stampedes : తొక్కిసలాటలు.. అభిమానుల ప్రాణాలంటే లెక్కలేదా..?
- జాగ్రత్తలు అసలే లేవు
- ఇష్టారీతని సభలు, మీటింగ్ లు
- ఇంత నిర్లక్ష్యమేంటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stampedes : తమిళనాడులో ఘోర విషాదం జరిగింది. విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 31 మంది ప్రాణాలు విడిచారు. ఇంకా పదుల కొద్దీ చావుతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగేలా కనిపిస్తోంది. దేశ చరిత్రలో ఓ పొలిటికల్ ఈవెంట్ కు వెళ్లి ఇంత మంది చనిపోవడం ఇదే మొదటిసారి కావచ్చు. ఈ నడుమ చాలా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఆర్సీబీ పరేడ్ లో తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు. అంతకు ముందు పుష్ప-2 ప్రీమియర్స్ కు వెళ్లి రేవతి అనే మహిళ చనిపోయారు. ఆమె కొడుకు ఇంకా బెడ్ మీద నుంచి లేవట్లేదు.
Read Also : Manchu Manoj : అర్జున్ రెడ్డి సినిమా మిస్ చేసుకున్న మంచు మనోజ్..
Also Read
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
- Crime Thriller OTT : నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే... ఓటీటీలోకి గూస్ బంప్స్ తెప్పించే కన్నడ క్రైమ్ థ్రిల్లర్
- Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ 'లగాన్'... మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
ఇక సినిమా ఈవెంట్లకు వెళ్లి ఎవరో ఒకరు చనిపోతున్న ఘటనలు లెక్కే లేదు. ఇక్కడ ఓ విషయం మాట్లాడుకోవాలి. తొక్కిసలాట ఎక్కడ జరిగినా సరే.. అక్కడ చనిపోయేది మాత్రం అభిమానులే. సినిమా ఈవెంట్ అయినా.. క్రికెట్ పరేట్ అయినా.. రాజకీయ సభ అయినా సరే.. చనిపోయేది మాత్రం సాధారణ అభిమానులే. హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు అందరూ బాగానే ఉంటారు. చనిపోయేది వాళ్ల కోసం వెళ్లిన సాధారణ ప్రేక్షకులే. ఒక ఈవెంట్ నిర్వహిస్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత మంది వస్తారు.. అసలు అక్కడ అంత పెద్ద సభ ఏర్పాటు చేయొచ్చా లేదా.. పోలీసుల సలహాలు ఏంటి అనేవి పాటించాలి కదా. కానీ ఎవరూ పాటించరు.
తమ బల ప్రదర్శన చూపించుకోవాలి.. దాన్ని మీడియాలో, సోషల్ మీడియాలో హైలెట్ చేసుకోవాలనే తాపత్రయమే తప్ప.. అభిమానులకు ఇబ్బంది అవుతుందనే విషయం కూడా ఆలోచించట్లేదు. ఆర్సీబీ పరేడ్ కు ఎంత మంది వస్తారనే సమాచారం లేకుండానే పరేడ్ నిర్వహించారా.. ఇప్పుడు విజయ్ ఎంత మంది వస్తారనే ఇన్ఫర్మేషన్ లేకుండానే ర్యాలీ చేశారా.. తెలిసి కూడా కావాలనే చేస్తున్నారా. ఇదంతా ఎందుకు చేస్తున్నారు.. ఎవరి కోసం చేస్తున్నారు. అక్కడికేదో దేశానికి సేవ చేస్తున్నంత బిల్డప్ ఇస్తూ ఈవెంట్ లు పెద్ద ఎత్తున నిర్వహించడం అవసరమా. ఆల్రెడీ చాలా తొక్కిసలాటలు జరుగుతున్నప్పుడు ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే ఎలా. అభిమానుల ప్రాణాలంటే మరీ అంత చులకన అయిపోయాయా. కొన్ని సార్లు పోలీసులు వద్దని అలెర్ట్ చేసినా వినట్లేదు. చివరకు పోలీసుల వైఫల్యం అని వాళ్ల మీద నెట్టేయడం కామన్ అయిపోయింది. ఎంత హీరో అయినా.. సెలబ్రిటీ అయినా పెద్ద సభలు పెట్టే ముందు ఆలోచిస్తే బెటర్.
Read Also : K-Ramp : కె-ర్యాంప్ అంటే బూతు కాదు.. అర్థం చెప్పిన డైరెక్టర్
తాజావార్తలు
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
-
Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!