Pushpa : వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు టైం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప: ది రైజ్” సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమా కంటే సినిమాలో స్టార్ హీరో అల్లు అర్జున్ మ్యానరిజమ్, డైలాగ్స్ సినీ ప్రియులను, అభిమానులను, అలాగే సెలెబ్రిటీలను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ షోకి సిద్ధమైంది. తాజాగా ‘పుష్ప’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లకు సంబంధించిన అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్.
Read Also : Radhe Shyam : కొత్త జీవో చిక్కులు… ఇంకా టికెట్స్ కౌంటర్స్ ఓపెన్ కాలేదు !!
Also Read
- PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
- Money Heist: 'మనీ హెయిస్ట్' ఫ్యాన్స్కు నెట్ఫ్లిక్స్ సర్ప్రైజ్.. ప్రొఫెసర్ ప్రయాణం ఇంకా ముగియలేదు!
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
ఈ మాస్ ఎంటర్టైనర్ శాటిలైట్ హక్కులను మా టీవీ భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఛానల్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ‘పుష్ప’ ప్రీమియర్ని ప్రసారం చేయబోతోంది. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ భరద్వాజ్, ఫహద్ ఫాజిల్ తదితరులు అత్యుత్తమ నటనను కనబరిచి ప్రశంసలు అందుకున్నారు. మరోవైపు ‘పుష్ప-2’ ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నారు టీం. ఇక ఇప్పటికే ఓటిటిలో అలరించిన ‘పుష్ప’రాజ్ సందడి టీవీల్లో ఎలా ఉంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్గా ఇలా ట్రై చేయండి!
-
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
-
RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!
-
PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..
-
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?