కంగనా, కాంగ్రెస్ వార్… కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ గా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకున్న కంగనా రనౌత్ అప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కంగనా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మామూలుగానే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన కంగనా రనౌత్ మరో వివాదంలో చిక్కుకుంది. 1947లో భారత్కు స్వాతంత్య్రం రాలేదని, బ్రిటీష్ వారు భిక్ష వేశారని, మనకు 2014లోనే మోదీ అధికారంలోకి వచ్చాక అసలైన స్వతంత్రం లభించిందని వ్యాఖ్యానించింది. 1947లో మనకు వచ్చింది స్వతంత్రం కాదని… భిక్ష అంటూ ఓ టీవీ న్యూస్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది కంగనా. కంగనా కామెంట్స్పై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భగ్గుమన్నాయి. దేశ ప్రతిష్టను దిగజార్చేలా కంగనా మాట్లాడిందంటూ… ముంబై పోలీసులకు ఆప్ నేత ప్రీతి మీనన్ ఫిర్యాదు చేశారు. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కోరారు. 504, 505 మరియు 124A సెక్షన్ల కింద విద్రోహ, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న కంగనా రనౌత్ పై చర్య తీసుకోవాలని అభ్యర్థిస్తూ ముంబై పోలీసులకు దరఖాస్తును సమర్పించినట్లు ప్రీతీ మీనన్ ట్వీట్ చేసింది.
Read Also : ‘జై భీమ్’ కాంట్రవర్సీ… మాజీ మంత్రి ఆరోపణలపై సూర్య రియాక్షన్
Also Read
- Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
- Kayadu Lohar: "రాయితో కొట్టి తల పగలగొట్టా".. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
- Nabha Natesh: పాములు మా ఇంట్లో కాపురం ఉంటాయి.. వాటిని చూస్తూ టిఫిన్ చేస్తా: నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
- Kalki Sequel: 'కల్కి 2' నుంచి దీపికా పదుకొణె అవుట్? ఆలియా భట్ ఎంట్రీపై ప్రభాస్ షాకింగ్ హింట్!
కంగనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ. అంతేకాదు… ఆమె విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలన్నారు. ఒక వేళ కంగనా వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నట్టయితే… ఆ విషయాన్ని ప్రధాని చెప్పాలన్నారు. లేదంటే కంగనాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆనంద్ శర్మ. మొత్తానికి నరేంద్ర మోడీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం గురించి గొప్పగా చెప్పబోయి అడ్డంగా బుక్కైపోయింది కంగనా. BJPని పొగిడే క్రమంలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వాళ్లను కంగన అవమానించడం తగదంటున్నాయి విపక్షాలు.
తాజావార్తలు
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!