Vishnu Priya : డబ్బు కోసం ఆ ఇంటికి వెళ్లి తప్పు చేశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు బుల్లితెరపై అత్యధిక పాపులారిటీ సాధించిన రియాలిటీ షో ‘బిగ్బాస్’ ప్రస్తుతం తన తొమ్మిదవ సీజన్తో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రతి ఏడాది కంటే ఈసారి కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేసిన ఈ షోలో 13 మంది కంటెస్టెంట్లు హౌస్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ హైప్లో మధ్యలో, మాజీ కంటెస్టెంట్ యాంకర్ విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెలివిజన్లో ‘పోవే పోరా’ వంటి షోల ద్వారా ప్రేక్షకులను అలరించిన విష్ణుప్రియకు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. గ్లామరస్ ఫోటోషూట్స్, సోషల్ మీడియాలో యాక్టివ్ ప్రెజెన్స్తో ఫ్యాన్స్కి దగ్గరైంది. గతంలో బిగ్బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన విష్ణుప్రియ అక్కడ పృథ్వీతో స్నేహం, కెమిస్ట్రీ కారణంగా పెద్ద చర్చకు దారితీసింది.
Also Read : Mithra Mandali : “మిత్ర మండలి” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
Also Read
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణుప్రియ తన బిగ్బాస్ అనుభవం గురించి ఓపెన్గా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. “నేను బిగ్బాస్ షోకు డబ్బుల కోసమే వెళ్లాను. కొత్త ఇల్లు కట్టుకోవచ్చని అనుకున్నా.. కానీ అది జరగలేదు. ఇప్పటికీ పాత ఇంట్లోనే ఉన్నాను. బిగ్బాస్ హౌస్కి వెళ్లడం నా జీవితంలో తీసుకున్న తప్పు నిర్ణయం. బిగ్బాస్ నుంచి నేను ఏమి నేర్చుకోలేకపోయాను. మళ్లీ ఆ షో నుంచి కాల్ వచ్చినా వెళ్లను. ఒక్కసారి వెళ్లినందుకు నన్ను నేనే తిట్టుకున్నాను. ఎందుకు వెళ్లాను అనిపించింది. నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అనిపించింది” అని చెప్పింది. విష్ణుప్రియ ఈ విధంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు ఆమె నిజాయితీని మెచ్చుకుంటుంటే, మరికొందరు “ఇలా చెప్పాల్సిన అవసరముందా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా, ఆమె ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
India Squads: పంత్కు షాక్.. నితీశ్కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
-
CBI Case: అమెరికా మిషనరీ సంస్థపై CBI కేసు.. 1,000కుపైగా విదేశీ డెబిట్ కార్డుల వ్యవహారం!
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!