ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులతో పాటు భారతదేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్’ సినిమా. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద ప్రకటించిన నాటి నుండి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించి రోజుకో ఒక ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే అందిస్తున్న విజయేంద్రప్రసాద్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అయితే తాజా ఇంటర్వ్యూలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో ఫైట్ సీన్స్ చూసి తాను కన్నీళ్లు పెట్టుకున్నాను అని చెప్పుకొచ్చాడు. సాధారణంగా ఎక్కడైనా ఫైట్ సీన్స్ చూస్తే ఈలలు వేస్తారు… కానీ ఈ ఫైట్ సీన్స్ చూస్తే మాత్రం కళ్ళవెంట నీళ్ళు తిరగడం ఖాయం అని చెప్పుకొచ్చారు. థియేటర్లకు వచ్చిన ఆడియన్స్ కూడా ఆ ఎమోషన్స్ కి కనెక్ట్ అవుతారని, ఇది చెబితే అర్థం కాదు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా గురించి ఎంత గొప్పగా మాట్లాడుకున్నా అది ఇంకా తక్కువే అవుతుందని ఆయన అన్నారు. అజయ్ దేవగన్, సముద్రకని లాంటి పలు భాషలకు చెందిన నటులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో ఎక్కడ దర్శకనిర్మాతలు వెనకాడటం లేదు.