Venky Atluri: డైరెక్టర్ వెంకీ అట్లూరి ప్రస్తుతం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి స్పందన అందుకుంటోంది. ఈ నేపథ్యంలో వెంకీ అట్లూరి తదుపరి ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన నెక్ట్స్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళ సార్ట్ హీరో ధనుష్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా ‘పోలీస్’ కథ నేపథ్యంలో తెరకెక్కబోతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఈ కథపై వర్క్ జరుగుతోందని వెంకీ అట్లూరి తెలిపారు. ఇది పోలీసు స్టోరీ కావడంతో కథను పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాతే తదుపరి సినిమాపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డ హీరోగా ఒక వెబ్ సిరీస్ తీస్తున్నట్లు తెలిపారు. ఈ వెబ్ సిరీస్ అయిపోయిన తర్వాత న్యాచురల్ స్టార్ నాని గారితో కూడా ఒక సినిమా చేయాల్సి ఉందని, ఆ కథపై కూడా వర్క్ చేయాలన్నారు. ముందు అయితే పోలీసు స్టోరీ పూర్తి అయిన తర్వాతనే ఈ కథపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. త్రివ్రికమ్ శ్రీనివాస్ గారితో తన సంబంధం గురుశిష్యుల బంధం అని చెప్పారు. ఇక నిర్మాతగా తనకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తన సినిమా నిర్మాతలు ఎప్పుడూ తనకు అండగా నిలుస్తారని వెంకీ అట్లూరి చెప్పారు. కొన్నిసార్లు బడ్జెట్ విషయంలో తాను కొంచెం హద్దులు దాటినా నిర్మాతలు తనను సపోర్ట్ చేస్తారని తెలిపారు. ప్రస్తుతం రిలీజ్ అయిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు పాజిటీవ్ స్పందన వస్తున్న నేపథ్యంలో వెంకీ అట్లూరి తదుపరి ప్రాజెక్టులపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఆయన దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కబోతున్న ‘పోలీస్’ కథ ఎప్పుడు పట్టాలెక్కుతుందనే దానిపై ధనుష్ ఫ్యాన్స్తో పాటు సినీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

