రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి రూపొందిస్తున్నారు. “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ – నేను మా టీమ్ వీక్షణం మూవీ గురించి ఎంతైనా చెప్పగలం. ఎవరి బిడ్డ వారికి ముద్దుగానే ఉంటుంది. మా సినిమా బాగుందని మేము చెప్పడం కాదు థియేటర్స్ లో చూసి మీరంతా చెబితే చాలా హ్యాపీగా ఫీలవుతాం. వీక్షణం తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. సక్సెస్ మీట్ లో మిమ్మల్ని మళ్లీ కలుస్తా, ఫ్రైడే తప్పకుండా థియేటర్స్ కు వెళ్లి వీక్షణం మూవీ చూడండి. అన్నారు.
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ – వీక్షణం వంటి ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ నాకు ఇచ్చిన మా డైరెక్టర్ మనోజ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. మా సినిమా మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో సరికొత్తగా ఉంటూ ఆకట్టుకుంటుంది. మనం రకరకాల జానర్ మూవీస్ ఇష్టపడుతుంటాం. కానీ థ్రిల్లర్ మూవీస్ అంటే అందరికీ ఇష్టమే. అలా మీ అందరికీ నచ్చే మంచి థ్రిల్లర్ మూవీ వీక్షణం. ఈ సినిమాకు పనిచేసి ప్రతి డిపార్ట్ మెంట్, ప్రతి టీమ్ మెంబర్ ఎంతో ప్యాషన్ తో వర్క్ చేశారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్..ఇలా టెక్నికల్ గా మా మూవీ చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ శుక్రవారం వీక్షణం సినిమాతో మీ ముందుకు వస్తున్నాం. థియేటర్స్ లో మా సినిమా చూసి ఎలా ఉందో చెబుతారని కోరుకుంటున్నా అన్నారు.