దివంగత నటుడు ఉదయ్ కిరణ్ అకాల మృత్యువాత పడి దాదాపు ఏడు సంవత్సరాలు అవుతోంది. ఆయన చివరగా నటించిన చిత్రం “చిత్రమ్ చెప్పిన కథ” ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. 2015లోనే థియేటర్లలోకి రావలసిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇది ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు సన్నద్ధమవుతోంది. “చిత్రమ్ చెప్పిన కథ” మేకర్స్ సినిమా విడుదల విషయమై ఇటీవల రెండు ఒటిటి ప్లాట్ఫామ్లతో చర్చలు జరిపారట. వారు ఈ ప్లాట్ఫారమ్ల నుండి ఆసక్తికరమైన ఆఫర్లను అందుకున్నట్లు తెలిసింది. ఈ వార్తలు గనుక నిజమైతే త్వరలోనే ఈ చిత్రం ఓటిటి ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రం విడుదల గురించి ఉదయ్ కిరణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.