Tollywood : ఓవర్సీస్ మార్కెట్పై కన్నేసిన తెలుగు హీరోలు
టాలీవుడ్ సినిమా ప్రమోషన్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, భారత్ సరిహద్దులు దాటి విస్తరిస్తున్నాయి. సాధారణంగా పాన్-ఇండియా మూవీ టీంలు కూడా భారత్లోని ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ప్రచారం చేస్తాయి. కానీ, ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు దేశాన్ని దాటి విదేశాల్లో సందడి చేస్తున్నాయి. రామ్చరణ్, బాలకృష్ణల దారిలోనే ప్రభాస్ కూడా నడుస్తున్నాడా? ‘రాజాసాబ్’ ప్రమోషన్స్ కోసం అమెరికాలో కొబ్బరికాయ కొట్టనున్నారా? లాంటి ప్రశ్నలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సినిమా రిలీజ్కు ముందే అమెరికా వెళ్లడం వల్ల ఒక పని పూర్తవుతుందని భావిస్తున్నారు నిర్మాతలు. డాలర్ల మార్కెట్కు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత భారత్లో ప్రమోషన్స్ ప్రారంభించాలనేది కొత్త ట్రెండ్.
Also Read :Manchu Manoj : 100 కోట్ల “మిరాయ్”..మంచు మనోజ్ కు “డేవిడ్ రెడ్డి” కంగ్రాట్స్
Also Read
- Tollywood : బీస్ట్ మోడ్లోకి స్టార్ బ్యూటీస్.. రియల్ స్టంట్స్ చేస్తోన్న హీరోయిన్స్
- OTT Movies : థియేటర్స్లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు
- Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ తెలుగు రిలీజ్ డౌటే
- Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య వివాహం
తెలుగు హీరోలు ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్పై కన్నేశారు. ప్రస్తుతం ‘మిరాయ్’ టీమ్ అమెరికాలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ ముగించుకుని, అమెరికా వెళ్లిన ఈ టీమ్ ఓవర్సీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అదే బ్యానర్లో వచ్చే ‘తెలుసు కదా’ యూనిట్ కూడా US వెళ్లనుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓవర్సీస్ ప్రమోషన్స్ ఇప్పుడు కంపల్సరీగా మారుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు విదేశీ మార్కెట్ నుంచి వచ్చే ఆదాయం కీలకమవుతోంది.
Also Read :Tollywood : సూపర్ హిట్ సినిమా బ్యూటీని పక్కన పెట్టేసిన టాలీవుడ్
ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా సంక్రాంతి రేసులో భాగంగా జనవరి 9న విడుదల కానుంది. దీంతో, డిసెంబర్ 20 నుంచే అమెరికాలో ఈవెంట్తో ప్రమోషన్స్ మొదలుపెట్టాలని నిర్మాత విశ్వప్రసాద్ ప్లాన్ చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓవర్సీస్ కలెక్షన్స్ను పెంచుకోవడమే లక్ష్యంగా, అమెరికాలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ట్రెండ్ మొదలైంది ‘గేమ్ ఛేంజర్’తో. రామ్చరణ్ నటించిన ఈ చిత్రం అమెరికాలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాతో అమెరికాలో సందడి చేశారు. ఇప్పుడు ‘అఖండ 2’ ప్రమోషన్స్ కూడా USలో జరుగుతాయా? అనేది చూడాలి. ఇలా తెలుగు సినిమాలు గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ, ప్రమోషన్ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!