Tollywood: తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీస్.. బాక్సాఫీస్ను షేక్ చేసిన టాప్ 10 సినిమాలివే!
- బాక్సాఫీస్ పరంగా రోజురోజుకూ కొత్త రికార్డులు
- ఇండస్ట్రీ స్థాయినే మార్చేసిన ఆర్ఆర్ఆర్, పుష్ప 2
- ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించిన టాప్ సినిమాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినిమా పరిశ్రమ బాక్సాఫీస్ పరంగా రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) కొన్ని సినిమాలు సాధించిన వసూళ్లు ఇండస్ట్రీ స్థాయినే మార్చేశాయి. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా క్రేజ్తో తెరకెక్కిన ఈ సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టించాయి. ఈ జాబితాలో టాప్ స్థానంలో నిలిచింది ‘ఆర్ఆర్ఆర్’. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.415 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఆల్టైమ్ రికార్డ్గా నిలిచింది.
ఆర్ఆర్ఆర్ తర్వాతి స్థానంలో ‘పుష్ప 2: ది రూల్’ ఉంది. రూ.346 కోట్ల గ్రాస్తో పుష్ప 2 సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ క్రేజ్ ఈ సినిమాతో మరో స్థాయికి చేరింది. మూడో స్థానంలో రాజమౌళి మరో ఎపిక్ మూవీ ‘బాహుబలి 2’ ఉంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.327 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి.. అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ రూ.296 కోట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవలి కాలంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ కేవలం 23 రోజుల్లోనే రూ.247 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ఈ సంఖ్య కాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ (238 కోట్లు), ప్రభాస్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ (234 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Also Read
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
- NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య - గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
పండుగ సీజన్లో విడుదలై కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకొచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ.218 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. పవర్ఫుల్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ రూ.210 కోట్లతో మరో భారీ హిట్గా నిలిచింది. ఈ టాప్ 10లో అల్లు అర్జున్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘అలా వైకుంఠపురములో’ రూ.194 కోట్ల గ్రాస్తో ముగించింది. ఈ సినిమాల వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో సినిమా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. భారీ కథలు, స్టార్ పవర్, పాన్ ఇండియా మార్కెట్ కలిసి టాలీవుడ్ను దేశంలోనే టాప్ ఇండస్ట్రీలలో ఒకటిగా నిలబెడుతున్నాయి.
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?