NTV Telugu Site icon

Tollywood : ఊర మాస్ డైరెక్టర్ దర్శకత్వంలో క్లాస్ హీరో.. హిట్ దక్కుతుందంటారా..?

Untitled Design (71)

Untitled Design (71)

యంగ్ హీరో శర్వానంద్ ఇటీవల ‘మనమే’ చిత్రం ద్వారా ఆడియన్స్ ను పలకరించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీ రామ్ ఆదిత్య తెరకెక్కించాడు. ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు, ఆశలు పెంచుకున్నాడు శర్వా. కాని ఈ సినిమా ఆడియన్స్ నుండి మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది. చాలా కాలంగా హిట్ లేని శర్వానంద్ కు ‘మనమే’ నిరాశనే మిగిల్చిందనే చెప్పాలి..

Also Read: Double Ismart: లైగర్ పంచాయతీ.. రంగంలోకి టాప్ డిస్ట్రిబ్యూటర్.. కొలిక్కి వచ్చేనా..? 

కాగా శర్వా ఎలాగైనా మళ్లి ఎక్స్ ప్రెస్ రాజా,శతమానంభవతి రేంజ్ హిట్టు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ దశలో పలు కథలు వినే పనిలో వింటున్నాడు. ఈ ప్రాసెస్ లో మాస్ డైరక్టర్ సంపత్ నంది చెప్పిన కథకు శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. సంపత్ నంది లాస్ట్ హిట్ గోపిచంద్ కలయికలో వచ్చిన సిటీమార్. 2021లో వచ్చిన ఈ సినిమా తర్వాత సంపత్ నుండి సినిమా రాలేదు. శర్వా కోసం పవర్ఫుల్ కథ రెడీ చేసాడని ఈ చిత్రంతో ఈ కుర్ర హీరో బౌన్స్ బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ అని సమాచారం. శర్వా,సంపత్ ల చిత్రాన్నా భారీ బడ్జెట్ పై సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె రాధామోహన్ నిర్మించనున్నారు. త్వరలో ఇందుకు సంభందించి అధికార ప్రకటన రానుంది. మరోవైపు శర్వా చివరి సినిమా మనమే రిలీజై కొన్ని నెలలు కావోస్తున్న ఇంతవరకు ఓటీటీ స్ట్రీమింగ్ కాలేదు. దీనిపై నిర్మాణ సంస్ధ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఓటీటీలో ఎప్పుడు ప్రసారం అవుతుందో చూడాలి.