యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తుండగా… అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ‘మహా సముద్రం’ షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఏమిటంటే… ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడానికి తిరస్కరించారట. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ రకుల్ ప్రీత్, కాజల్, శృతి హసన్ లను సంప్రదించారట. కాని వారిలో ఎవరూ ‘మహాసముద్రం’లో చిందేయడానికీ ఆసక్తి చూపించలేదట. ఈ ద్విభాషా చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.