Site icon NTV Telugu

SSMB29 : మహేష్ కి జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ..?

Mahesh

Mahesh

SSMB29 : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటించిన “గుంటూరు కారం “సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయి మంచి విజయం సాధించింది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది.ఇదిలా  ఉంటే మహేష్ తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు.ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా వస్తున్న ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్.నారాయణ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాకోసం మహేష్ తన లుక్ ను పూర్తిగా చేంజ్ చేస్తున్నారు.

Read Also :Indian 2 : కమల్ కంటే సిద్దార్థ్ ఎక్కువగా కనిపించునున్నారా..?

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.త్వరలోనే ఈ మూవీకి సంబంధించి రెగ్యులర్ షూట్ కూడా ప్రారంభం కానుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట బాగా వైరలవుతుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ప్రశ్నగా మారింది.అయితే ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం.ఇప్పటికే ఈ భామ టాలీవుడ్ లో ఎన్టీఆర్ ,రాంచరణ్ వంటి స్టార్ హీరోల సరసన నటిస్తున్న ఈ భామ ఇప్పుడు మహేష్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసిందని ఓ వార్త బాగా వైరల్ అవుతుంది.

Exit mobile version