మూడో వెబ్ సీరిస్ కు మిల్కీబ్యూటీ గ్రీన్ సిగ్నల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తమన్నా ముచ్చటగా మూడో వెబ్ సీరిస్ కు పచ్చ జెండా ఊపేసింది. ఇప్పటికే తెలుగులో ‘లెవన్త్ అవర్’, తమిళంలో ‘నవంబర్ స్టోరీ’ వెబ్ సీరిస్ లలో తమన్నా నటించింది. ‘లెవన్త్ అవర్’ బిజినెస్ వరల్డ్ నేపథ్యంలో సాగే వెబ్ సీరిస్ కాగా, ‘నవంబర్ స్టోరీ’ అందుకు పూర్తి భిన్నమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సీరిస్. ఈ రెండు వెబ్ సీరిస్ లలో తమన్నా నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో మరికొంతమంది నిర్మాతలు తమన్నాతో వెబ్ సీరిస్ చేసేందుకు ముందుకొచ్చారు. అందులో ఒక దానికి తమన్నా తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివిధ భాషల్లో రూపుదిద్దుకోబోతున్న ఈ రొమాంటిక్ డ్రామాను అరుణిమా శర్మ డైరెక్ట్ చేయబోంది. ఈ యేడాది సెప్టెంబర్ నుండి ఇది సెట్స్ పైకి వెళుతుంది. దీనిని దర్శకుడు దినేష్ విజన్ నిర్మించబోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు షెడ్యూల్స్ లో చిత్రీకరణ పూర్తి చేసుకునే ఈ వెబ్ సీరిస్ ను 2022లో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయబోతోంది. తమన్నాతో పాటు ఆషిమ్ గులాటీ ప్రధాన పాత్ర పోషించబోతున్న దీనికి ‘యారీ దోస్తీ’ అనే పేరు ఖరారు చేశారట. ఈ వెబ్ సీరిస్ కోసం అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి దినేశ్ విజన్ తో డీల్ కుదుర్చుకుందని వార్తలు వస్తున్నాయి. గత రెండు వెబ్ సీరిస్ కు భిన్నంగా తమన్నా ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉండే లవర్ పాత్రను పోషించబోతోందట. సో… తెలుగు, తమిళ వెబ్ సీరిస్ తర్వాత తమన్నా ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం హిందీ వెబ్ సీరిస్ చేస్తోందని అనుకోవచ్చు.
Also Read
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
- Samantha Maa Inti Bangaram Review: సమంత మా ఇంటి బంగారం మూవీ రివ్యూ
- Tollywood : టాలీవుడ్ను ముంచేస్తున్న ‘మార్కెట్ మోడల్’.. అసలు క్రైసిస్ ఇక్కడే!
- Mahendragiri Varahi: మైండ్ బ్లాక్ చేస్తున్న సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’!
తాజావార్తలు
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!