పోలీసుల అదుపులో సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితాని
బాలీవుడ్ యంగ్ హీరో, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి బాలీవుడ్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆయన మరణం తరువాత అనూహ్యంగా మాదకద్రవ్యాల కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితానిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) శుక్రవారం అదుపులోకి తీసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాదకద్రవ్యాల కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్సిబి అధికారులు హైదరాబాద్కు చెందిన సిద్దార్థ్ పితానిని 28, 29, 27 ఎ సెక్షన్ల కింద కుట్రపన్నారనే ఆరోపణలతో అరెస్టు చేసి ముంబైకి తరలించారు. మాదకద్రవ్యాల కేసులో సిద్దార్థ్ పితాని పాత్ర ఉన్నట్టు ఇటీవల ఎన్సిబి దర్యాప్తులో బయటపడింది. అందుకే అతన్ని అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. కాగా ముంబైలోని తన బాంద్రా ఫ్లాట్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్తో కలిసి సిద్ధార్థ్ నివసించేవాడు. జూన్ 14న సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణానికి ముందురోజు రాత్రి… అంటే తెల్లవారుజామున 1 గంటలకు సుశాంత్ను కలిశాను అని సిద్ధార్థ్ పోలిసుల విచారణలో వెల్లడించారు. గత ఏడాది ఆగష్టులో సిబిఐ సిద్ధార్థ్ తో పాటు కుక్ నీరజ్, దినేష్ సావంత్ ను ఇన్వెస్టిగేట్ చేసింది.
Also Read
తాజావార్తలు
-
US-Iran talks: శాంతి చర్చల్లో అనిశ్చితి.. పాక్ నుంచి వెళ్లిపోయిన ఇరాన్ బృందం..
-
KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..
-
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ.. పలు రికార్డ్స్ బ్రేక్
-
Scientists disappear: సైంటిస్టులు మాయం.. అమెరికా, చైనాలో టెన్షన్..
-
SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!