పోలీసుల అదుపులో సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ యంగ్ హీరో, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి బాలీవుడ్ లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆయన మరణం తరువాత అనూహ్యంగా మాదకద్రవ్యాల కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సుశాంత్ స్నేహితుడు సిద్దార్థ్ పితానిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) శుక్రవారం అదుపులోకి తీసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాదకద్రవ్యాల కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్సిబి అధికారులు హైదరాబాద్కు చెందిన సిద్దార్థ్ పితానిని 28, 29, 27 ఎ సెక్షన్ల కింద కుట్రపన్నారనే ఆరోపణలతో అరెస్టు చేసి ముంబైకి తరలించారు. మాదకద్రవ్యాల కేసులో సిద్దార్థ్ పితాని పాత్ర ఉన్నట్టు ఇటీవల ఎన్సిబి దర్యాప్తులో బయటపడింది. అందుకే అతన్ని అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. కాగా ముంబైలోని తన బాంద్రా ఫ్లాట్లో సుశాంత్ సింగ్ రాజ్పుత్తో కలిసి సిద్ధార్థ్ నివసించేవాడు. జూన్ 14న సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మరణానికి ముందురోజు రాత్రి… అంటే తెల్లవారుజామున 1 గంటలకు సుశాంత్ను కలిశాను అని సిద్ధార్థ్ పోలిసుల విచారణలో వెల్లడించారు. గత ఏడాది ఆగష్టులో సిబిఐ సిద్ధార్థ్ తో పాటు కుక్ నీరజ్, దినేష్ సావంత్ ను ఇన్వెస్టిగేట్ చేసింది.
Also Read
తాజావార్తలు
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..