Suriya: తమిళ స్టార్ హీరో సూర్య చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. సినిమా విజయాలు, అపజయాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ..”‘కంగువ’ సినిమా కోసం దాదాపు 200 రోజుల పాటు పనిచేశాను. ఎంతో కష్టపడి, భారీ స్థాయిలో తెరకెక్కించిన ఆ చిత్రం మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ ‘కరుప్పు’ సినిమాను కేవలం 45 రోజుల్లో పూర్తి చేశాం. అయితే ఈ సినిమా మాత్రం థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత ఈ ఏడాది అతిపెద్ద ఇండస్ట్రీ సక్సెస్ల్లో నిలిచిన పలు సినిమాల్లో ఈ సినిమా అగ్రస్థానంలో నిలిచింది” అని అన్నారు.
సినిమా పరిశ్రమలో సక్సెస్ కోసం కచ్చితమైన ఫార్ములా ఉండదని సూర్య పేర్కొన్నారు. “ఇండస్ట్రీలో నాకు 30 ఏళ్ల అనుభవం ఉన్నా.. అన్నీ నేర్చుకున్నానని ఇప్పటికీ చెప్పలేను. ఏ సినిమా ఎలా ఆడుతుందో ముందే అంచనా వేయడం చాలా కష్టం. ప్రతి సినిమా కొత్త అనుభవాన్నే నేర్పిస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ‘కంగువ’ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ ఫాంటసీ సినిమాగా తెరకెక్కించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మిత్రమ స్పందనను సొంతం చేసుకుంది. ఆర్జే బాలాజీ డైరెక్షన్లో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘కరుప్పు’. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రిన్ని మేకర్స్ ఒక సూపర్ హిట్ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. 2026 మే నెలలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకొని, 2026 సంవత్సరంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తాజాగా హీరో సూర్య ఈ రెండు సినిమాలకు పోల్చుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా విజయాన్ని కేవలం బడ్జెట్, షూటింగ్ రోజులు లేదా భారీ నిర్మాణ విలువలు మాత్రమే నిర్ణయించవని, ప్రేక్షకుల ఆదరణే చివరికి అసలు విజయాన్ని నిర్ణయిస్తుందని ఆయన మాటలు మరోసారి గుర్తు చేస్తున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

