కోవిడ్-19 రిలీఫ్ కోసం సన్ టీవీ భారీ విరాళం
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. అది సృష్టిస్తున్న అల్లకల్లోలానికి ఎంతోమంది బలైపోయారు. ఇంకా చాలామంది కరోనాతో పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా రిలీఫ్ కోసం సహాయాన్ని అందించడానికి పలు సంస్థలు, పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా భారత్ కరోనా బాధితులను ఆదుకోవడానికి కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ గా భారీ విరాళాన్ని హైరాబాద్ సన్ రైజర్స్ ప్రకటించారు. రూ.30 కోట్ల భారీ విరాళాన్ని అందజేయనున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘కోవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా ప్రభావితమైన బాధితులకు అండగా నిలిచేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజ్ సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మాతృ సంస్థ సన్ టివి నెట్వర్క్ రూ.30 కోట్లు విరాళంగా ఇస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కోవిడ్-19 రిలీఫ్ కార్యక్రమాల కోసం ఈ నిధులను ఉపయోగించబోతున్నాము. ఆక్సిజన్ సిలిండర్లు, మెడిసిన్ సరఫరా తదితర కార్యక్రమాలపై ఎన్జిఓ లతో భాగస్వామ్యమవుతాము. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మీడియా ద్వారా అవగాహన కల్పిస్తాము’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు సన్ టీవీ వారు.
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!