‘శుభముహూర్తం’ దర్శకుడు గిరిధర్ ఇక లేరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ కో-డైరెక్టర్, నటుడు ఇరుగు గిరిధర్ (64) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం, ఇరంగారిపల్లిలో 1957 మే 21న గిరిధర్ జన్మించారు. చిత్తూరు జిల్లాలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత 1982లో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఎ. కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఇవీవీ సత్యనారాయణ తదితరుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. వినోద్ కుమార్, ఆమని, ఇంద్రజ ప్రధాన పాత్రలు పోషించిన ‘శుభముహూర్తం’ చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. అయితే ఆ చిత్రం కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో గిరిధర్ కు దర్శకుడిగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత తిరిగి కో-డైరెక్టర్ గా ‘అన్నవరం, గుడుంబా శంకర్, వన్, సుప్రీమ్, వరుడు’ వంటి సినిమాలు పనిచేశారు. ‘ఎక్స్ ప్రెస్ రాజా, 100 పర్శంట్ లవ్, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, సుప్రీమ్’ వంటి దాదాపు ఇరవై చిత్రాలలో నటించారు. అలానే కొన్ని టీవీ కార్యక్రమాలను రూపొందించారు.
Read Also : ఎట్టకేలకు స్పందించిన శిల్పాశెట్టి… భర్త కేసుపై సుదీర్ఘ వివరణ
Also Read
- CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. 'జన నాయగన్' సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
- Peddi : బుకింగ్స్ ఓపెన్ చేసిన గ్లోబల్ స్టార్..అమెరికాలో ‘పెద్ది’ సందడి.. టికెట్ రేట్లు ఇవే!
- Karuppu: ‘కరుపు’ ట్రైలర్ టైమ్ ఫిక్స్.. సూర్య ఫ్యాన్స్కు మాస్ ట్రీట్ రెడీ!
- P. Bharat Bhushan: ఏపీ ఎఫ్డీసీ చైర్మన్గా పి. భరత్ భూషణ్..
కొంతకాలం క్రితం హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరిధర్ కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ మధ్య దర్శకుడు సుకుమార్ వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. గిరిధర్ కు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు విదేశాల నుండి రాగానే ఈ రోజు (సోమవారం) అంత్యక్రియలను పూర్తి చేయబోతున్నారు.
తాజావార్తలు
-
Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
-
Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
-
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?
-
PM Modi: పరాన్నజీవి కాంగ్రెస్, డీఎంకేను వెన్నుపోటు పొడిచింది.. ప్రధాని మోడీ ఫైర్..