పరువు తీసిన ‘వాళ్లు’ పాతిక కోట్లు ఇవ్వాలంటోన్న మిసెస్ కుంద్రా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శిల్పా శెట్టికి కోపం వచ్చింది. రాదా మరి? ఇష్టానుసారం వార్తలు రాస్తే ఎవరికైనా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అందుకే, కొన్ని మీడియా సంస్థలపై శిల్పా ఏకంగా 25 కోట్ల పరువు నష్టం దావా వేసింది! ఇంతకీ, కారణం ఏంటి అంటారా? ఆమె భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారమే!
సాధారణంగా ఒక సెలబ్రిటీ కానీ, వారి దగ్గరి వారుగానీ అరెస్ట్ అయితే పెద్ద రచ్చ అవుతూ ఉంటుంది. పైగా శిల్పా శెట్టి లాంటి గ్లామరస్ ఇమేజ్ ఉన్న బాలీవుడ్ బ్యూటీతో విషయం ముడిపడే సరికి ఈసారి ఇంకాస్త సంచలనం అయింది. అయితే, అన్నిటికంటే ముఖ్యంగా మిష్టర్ కుంద్రా న్యూడ్ వీడియోల విషయంలో వివాదంలో ఇరుక్కోవటం అందర్నీ షాక్ కు గురి చేసింది! కేసులో సెక్స్ యాంగిల్ కూడా ఉండటంతో మీడియాలో వార్తలు ఎడాపెడా వచ్చేశాయి! అదే శిల్పాకి చిర్రెత్తుకొచ్చేలా చేసింది…
Also Read
తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ కొన్ని మీడియా హౌజెస్ పై బాంబే హైకోర్ట్ ను ఆశ్రయించింది శిల్పా శెట్టి కుంద్రా. అబద్ధాల్ని కూడా నిజాలుగా ప్రచారం చేశారంటూ ఆమె ఆరోపించింది. తన భర్త నుంచీ తాను విడిపోయానని కూడా కొన్ని వార్తలొచ్చాయంటూ శిల్పా కోర్టుకు విన్నవించుకుంది. తక్షణం తప్పుడు వార్తల్ని ఆపే విధంగా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఆమె అతి చేసిన సదరు మీడియా సంస్థలు తనకు సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. అంతే కాదు, తప్పుడు వార్తలు వండిన వారి నుంచీ 25 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని కోర్టును కోరింది!
శిల్పా ఆరోపణలపై ప్రస్తుతం ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఆగస్ట్ 10 దాకా ఆమె భర్త రాజ్ కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండనున్నాడు.
తాజావార్తలు
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
-
KKR vs GT: ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన మ్యాచ్.. టీ20 క్రికెట్లో కూడా కేకేఆర్-గుజరాత్ మ్యాచ్ రేర్ మైల్స్టోన్!
-
Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..