పరువు తీసిన ‘వాళ్లు’ పాతిక కోట్లు ఇవ్వాలంటోన్న మిసెస్ కుంద్రా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శిల్పా శెట్టికి కోపం వచ్చింది. రాదా మరి? ఇష్టానుసారం వార్తలు రాస్తే ఎవరికైనా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అందుకే, కొన్ని మీడియా సంస్థలపై శిల్పా ఏకంగా 25 కోట్ల పరువు నష్టం దావా వేసింది! ఇంతకీ, కారణం ఏంటి అంటారా? ఆమె భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారమే!
సాధారణంగా ఒక సెలబ్రిటీ కానీ, వారి దగ్గరి వారుగానీ అరెస్ట్ అయితే పెద్ద రచ్చ అవుతూ ఉంటుంది. పైగా శిల్పా శెట్టి లాంటి గ్లామరస్ ఇమేజ్ ఉన్న బాలీవుడ్ బ్యూటీతో విషయం ముడిపడే సరికి ఈసారి ఇంకాస్త సంచలనం అయింది. అయితే, అన్నిటికంటే ముఖ్యంగా మిష్టర్ కుంద్రా న్యూడ్ వీడియోల విషయంలో వివాదంలో ఇరుక్కోవటం అందర్నీ షాక్ కు గురి చేసింది! కేసులో సెక్స్ యాంగిల్ కూడా ఉండటంతో మీడియాలో వార్తలు ఎడాపెడా వచ్చేశాయి! అదే శిల్పాకి చిర్రెత్తుకొచ్చేలా చేసింది…
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
తన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ కొన్ని మీడియా హౌజెస్ పై బాంబే హైకోర్ట్ ను ఆశ్రయించింది శిల్పా శెట్టి కుంద్రా. అబద్ధాల్ని కూడా నిజాలుగా ప్రచారం చేశారంటూ ఆమె ఆరోపించింది. తన భర్త నుంచీ తాను విడిపోయానని కూడా కొన్ని వార్తలొచ్చాయంటూ శిల్పా కోర్టుకు విన్నవించుకుంది. తక్షణం తప్పుడు వార్తల్ని ఆపే విధంగా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ఆమె అతి చేసిన సదరు మీడియా సంస్థలు తనకు సారీ చెప్పాలని డిమాండ్ చేసింది. అంతే కాదు, తప్పుడు వార్తలు వండిన వారి నుంచీ 25 కోట్ల నష్ట పరిహారం ఇప్పించాలని కోర్టును కోరింది!
శిల్పా ఆరోపణలపై ప్రస్తుతం ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఆగస్ట్ 10 దాకా ఆమె భర్త రాజ్ కుంద్రా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉండనున్నాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!