NTV Telugu Site icon

Samantha : ఏటో వెళ్ళిపోయింది మనసు జోడి మళ్ళి కలిసింది.. ఎందుకంటే..?

Untitled Design (14)

Untitled Design (14)

నేచురల్ స్టార్ నాని, టాలీవుడ్ బ్యూటీ సమంతహీరోయిన్ గా 2012లో వచ్చిన చిత్రం ‘ఏటో వెళ్ళిపోయింది మనసు’. తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నాని సామ్ జోడి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. చాలా కాలం తర్వాత ఈ సూపర్ హిట్ జోడి మరోసారి కలిసింది.

Also Read: Vijay : విజయ్ పార్టీకి చిరు ప్రజారాజ్యానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అనే చిత్రంలో నటిస్తున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో నేచురల్ స్టార్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవల చెన్నై లో ఈ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొని అక్కడి మీడియాతో ముచ్చటించారు. పాన్ ఇండియా భాషల్లో రానున్న సరిపోదా శనివారం హిందీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ నుండి ముంబై వెళుతుండగాఎయిర్ పోర్ట్ లో సమంత అనుకోకుండా కలిసాడు నాని. యాదృచ్చికంగా జరిగిన ఈ కలయికను హీరోయిన్ సమంత తన ఫోన్ లో క్లిక్ మనిపించించి ఇన్ స్టాగ్రామ్ లో స్వీటెస్ట్ సర్పైజ్ టుడే అంటూ నానిని ట్యాగ్ చేసింది సామ్. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో ఒక్క్కసారిగా వైరల్ అయ్యాయి. అయితే నెటిజన్స్ మళ్ళి వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుంటుందని ఏటో వెళ్ళిపోయింది మనసు -2 చేస్తే సూపర్ హిట్ అవుతుందని కామెంట్స్ పెడుతున్నారు. ఇటు నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు, అటు సామ్ పలు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది.