Salman Khan : సల్మాన్ ఖాన్ పేరుతో సైలెంట్ గా మోసం చేసిన కేటుగాళ్లు..
- సల్మాన్ ఖాన్ వస్తున్నడంటూ సోషల్ మీడియాలో ప్రచారం
- అభిమాన హీరోను చూసేందుకు టికెట్స్ బుక్ చేసుకున్న ఫ్యాన్స్
- ఫేక్ ప్రచారాన్ని కొట్టిపారేసిన సల్మాన్ టీమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అమెరికాలో జరగనున్న ఓ ఈవెంట్లో సల్మాన్ పాల్గొంటున్నాడని, అందుకు సంబంధించి టికెట్స్ కొనాలనేది ఆ వార్త సారాంశం. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోను చూసేందుకు సల్మాన్ ఫ్యాన్స్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. తమకు తెలియకుండా జరిగిన ఈ ఫేక్ ప్రచారంపై సల్మాన్, ఆయన టీం స్పందించారు. ఈ విషయంలో ఆయన అభిమానులను హెచ్చరించారు. అమెరికాలో జరిగే ఈవెంట్లో సల్మాన్ పాల్గోనున్నారని.. దానికోసం టికెట్స్ కొనాలని వస్తున్న వార్తలన్నీపూర్తి అవాస్తవం అని తెలిపారు. తాను అమెరికాలో జరిగే ఏ ఈవెంట్ లోనూ పాల్గొనడం లేదని స్పష్టత ఇచ్చారు.
Also Read : Poonam Kaur : జానీ మాస్టర్ ని ఇక నుంచి మాస్టర్ అని పిలవొద్దు..
Also Read
ఈ ఏడాది అమెరికాలో జరిగే ఏ ఈవెంట్తో సల్మాన్కు ఎలాంటి సంబంధం లేదు. అతని అనుబంధ కంపెనీలకు కూడా దీనిపై ఎటువంటి సమాచారం లేదు. అతని బృందం అమెరికాలో కచేరీలు కానీ ప్రదర్శనలు కానీ ఎటువంటి వాటిని నిర్వహించడం లేదు. ఈ ఈవెంట్లో సల్మాన్ పాల్గొంటాడన్న ప్రచారాన్ని నమ్మవద్దు. దీనికి సంబంధించిన మెయిల్స్, మెసేజ్లను నమ్మవద్దు. తమ స్వలాభం కోసం సల్మాన్ పేరును దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని సల్మాన్ బృందం పేర్కొంది. ఇందుకు సంబంధించి సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ను చేశారు. ఇప్పటికే టికెట్స్ బుక్ చేసుకున్న కొందరు ఇదంతా సోషల్ మీడియా కేటుగాళ్లు చేసిన మోసం అని తెలిసి తాము మోసపోయామని వాపోయారు.
తాజావార్తలు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
-
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
-
Rahul Gandhi: మోడీ విదేశీ టూర్లపై రాహుల్ గాంధీ విసుర్లు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!