వెండితెరపై ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లడంలో కథనంతో పాటు విజువల్స్ కూడా అంతే కీలకమైన పాత్ర పోషిస్తాయి. సరిగ్గా అదే తరహా లావిష్ విజువల్స్, గ్రిప్పింగ్ నరేషన్తో రేపు (జూలై 17న) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది “రాజా ది రాజా”. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను వృందావన్ క్రియేషన్స్ బ్యానర్పై కె. నిహారిక దాసరి నిర్మించగా, కె. శ్రీలతా రెడ్డి సమర్పిస్తున్నారు. ప్రస్తుతం జోరుగా సాగుతున్న ప్రమోషన్స్తో భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం రేపు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన చిత్ర ప్రమోషన్స్ లో సీనియర్ నటుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ పాల్గొని సినిమా టెక్నికల్ టీమ్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సాయికుమార్ మాట్లాడుతూ.. సినిమాను నెక్ట్స్ లెవల్కు తీసుకెళ్లిన టెక్నికల్ టీమ్ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ముఖ్యంగా దర్శకుడు అనిల్ బోయిదాపు, సినిమాటోగ్రాఫర్ (డీఓపీ) రవికిరణ్ బోయిదాపుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఆయన “కృష్ణార్జునులు” తో అభివర్ణించారు. వీరిద్దరి మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీ, సమన్వయం వల్లే స్క్రీన్ మీద విజువల్స్ ఒక రేంజ్లో వచ్చాయని కొనియాడారు. “అనిల్ దర్శకత్వ ప్రతిభ, రవికిరణ్ ఫ్రేమింగ్ సెన్స్ కృష్ణార్జునుల్లా ఒక్కటిగా పనిచేసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. వీరి కో-ఆర్డినేషన్ వల్లే సాధారణంగా పెద్ద పెద్ద ఫాంటసీ, పీరియాడిక్ సినిమాల్లో మాత్రమే అరుదుగా కనిపించే లావిష్ విజువల్స్ ఈ సినిమాలో సాధ్యమయ్యాయి. నాచురల్ లైటింగ్, వైడ్ ఫ్రేమ్స్ను వాడుకుంటూ కాలేజ్ సన్నివేశాలను, అందమైన లొకేషన్లను రవికిరణ్ తన కెమెరాలో చాలా అద్భుతంగా బంధించాడు” అని సాయికుమార్ ప్రశంసల జల్లు కురిపించారు.

