రాజ్ కుంద్రా కర్మ… ఖర్మగా తిరిగొచ్చిందంటోన్న సచిన్ జోషి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది. చేసిన పాపం ఊరికే పోదు… అంటున్నాడు సచిన్ జోషి. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన ఈ యాక్టర్ కమ్ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాపై లీగల్ బ్యాటిల్ లో నెగ్గాడు. వారిద్దరి మధ్యా గత కొంత కాలంగా ‘ఎస్జీపీఎల్ సత్యయుగ్ గోల్డ్ స్కీమ్’ విషయంలో వివాదం నడుస్తోంది. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ‘సత్యయుగ్’ అనే కంపెనీకి చైర్మన్ గా వ్యవహరిస్తూ బంగారంపై ఆదాయం అందిస్తామంటూ అప్పట్లో స్కీమ్ ప్రకటించాడు. దాన్ని నమ్మి సచిన్ జోషి కొంత బంగారం వారి వద్ద ఉంచాడు. కానీ, అయిదేళ్ల నిర్ధిష్ట సమయం పూర్తయ్యాక సచిన్ కి రాజ్ కుంద్రా కంపెనీ నుంచీ బంగారం తిరిగి రాలేదు. కిలో బంగారం అలా తమ వద్ద ఉంచేసుకుని అడ్డగోలుగా ప్రవర్తించటంతో జోషి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది…
Read Also : పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ… హైప్ పెంచేస్తున్న రచయిత
Also Read
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
- Korean Kanakaraju First Review: ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఇవే.. అసలు మేటర్ ఏంటంటే?
- RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
రాజ్ కుంద్రా తనని మోసం చేశాడని న్యాయస్థానానికి వెళ్లిన సచిన్ జోషీకి తాజాగా అనుకూల తీర్పు వచ్చింది. రాజ్ కుంద్రా 25లక్షల 50వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కర్మ… ఖర్మగా మారి… వెంటాడుతుందంటూ సచిన్ ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. తమ లాగే ఎందరో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా పేర్లు చూసి మోసపోయారని కూడా అన్నాడు. తన 18లక్షలు విలువ చేసే బంగారం తిరిగి ఇవ్వటానికి కుంద్రా ఏర్పాటు చేసిన కంపెనీ వారు 25లక్షలు అడిగారనీ ఆయన గతాన్ని గుర్తు చేసుకున్నాడు!
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా జూలై 19న నీలి చిత్రాల వ్యవహారంలో అరెస్ట్ అయ్యాడు. ఆయన ఆన్ లైన్ లో న్యూడ్ వీడియోస్ దందా చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. రాజ్ కుంద్రా పై కంప్లైంట్ చేసిన యువతి తనలాగే ఎందరో అమ్మాయిలు మోసపోయారని అంటోంది. పూనమ్ పాండే కూడా కుంద్రాపై చాలా రోజులుగా న్యాయపోరాటం చేస్తోంది. ఆమె ఫోటోలు, వీడియోలు అగ్రిమెంట్ క్యాన్సిలేషన్ తరువాత కూడా వాడుకున్నారని ఆమె అంటోంది. మొత్తంగా చూస్తే, రాజ్ కుంద్రాతో పాటూ శిల్పా శెట్టికి బ్యాడ్ టైం నడుస్తున్నట్టే కనిపిస్తోంది. చూడాలి మరి, ముందు ముందు ఇంకెన్ని పాత కేసులు తిరగబెట్టబోతున్నాయో…
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!