రెజీనా కసాండ్ర, సుబ్బరాజు, జె.డి. చక్రవర్తి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘బ్రేకింగ్ న్యూస్’. సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు కథ, మాటలు బీవీఎస్ రవి అందిస్తున్నారు. రా ఎంటర్ టైన్మెంట్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ”సోషల్ సెటైరికల్గా ప్రస్తుత కాలమాన పరిస్థితులపై వాస్తవిక కోణంలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైరెక్టర్ సుబ్బు వేదుల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తొలి షెడ్యూల్ షూటింగ్ డిసెంబర్ మూడో వారం వరకు కొనసాగుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణను చేస్తున్నాం. వైవిధ్యమైన కథనంతో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తాం” అని అన్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తుండగా, ఈశ్వర్ ఎలుమహంతి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.