బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, శ్రద్దా కపూర్ నటిస్తున్న సినిమా షూటింగ్ సెట్ తో పాటు రాజశ్రీ ప్రొడక్షన్ చిత్రం సెట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భయంతో అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు. ఒక్క నిమిసం అక్కడ ఏంజరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో.. మంటలు వేగంగా వ్యాపించాయి. అయితే.. ఈఘటనపై ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి అశోక్ దూబే మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని ముంబయి శివారు అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉన్న చిత్రకూట్ మైదానంలో పక్క పక్కనే వేసిన రెండు సినిమా సెట్టింగు వేశామని పేర్కొన్నారు. ఒకచోట రాజశ్రీ ప్రొడక్షన్స్ చిత్రం, మరోచోట డైరక్టర్ లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్బీర్, శ్రద్ధా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న కొత్త మూవీ చిత్రీకరణలు జరుగుతుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయని తెలిపారు. అయితే ఈ సెట్ లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారని పేర్కొన్నారు.
Read also: Casino Case: హీరోయిన్ల బాగోతాలు బట్టబయలు.. మరీ అంతనా?
సాయంత్రం 4.30 గంటలకు మొదలైన మంటలు రాత్రి తొమ్మిదిన్నరకు అదుపులోకి వచ్చాయి. మంటలు ఆర్పేందుకు ఎనిమిది ఫైర్ ఇంజిన్లు, అయిదు నీటి జెట్టీలతో సిబ్బంది శ్రమించారు. అయితే.. మొదట ఆ ప్రాంతంలోని ఒక దుకాణంలో మంటలు వచ్చినట్టు అధికారులు చెప్పినప్పటికీ.. ఆ తర్వాత ఫిల్మ్ సెట్లో మంటలు చెలరేగినట్టు స్పష్టం చేసారు. ఈ ప్రమాదంలో హీరోహీరోయిన్లు అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. అయితే.. లవ్ రంజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ స్పెయిన్లో షూటింగ్ షెడ్యూల్ను ముగించుకుని ఇటీవలే ముంబయి వచ్చారు. ఈ సినిమాలో.. రణ్బీర్, శ్రద్ధా కపూర్ లతో పాటు బోనీ కపూర్, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా 2023 మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ప్రమాదంతో రణ్బీర్, శ్రద్దదాస్ అభిమానులు భయాందోళనకు గురయ్యారు. తన అభిమాన హీరో హీరోయిన్ ప్రాణాపాయం తప్పడంతో.. ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సమీత్ ఠాకూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. నెటిజన్లు కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు.
Video Image of fire at Chitrakoot Studio Andheri Mumbai. @mieknathshinde @Dev_Fadnavis @CPMumbaiPolice pic.twitter.com/0DTfAk7VbG
— Sameet Thakkar (@thakkar_sameet) July 29, 2022