అఫిషియల్ : “రాక్షసుడు” సీక్వెల్ వచ్చేస్తోంది !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“రాక్షసుడు” సీక్వెల్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సైకో థ్రిల్లర్ మూవీ “రాక్షసుడు” బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళ హిట్ మూవీ “రాట్చసన్”కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్ గానూ, నటన పరంగానూ శ్రీనివాస్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రంగా మిగిలింది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కొనేరు సత్యనారాయణ క్రైమ్ థ్రిల్లర్ను నిర్మించారు. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ముందుగానే ప్రకటించారు. అన్నట్టుగానే తాజాగా సీక్వెల్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను నేడు అనౌన్స్ చేశారు.
Read Also : “కార్తికేయ-2″కు ఆసక్తికర టైటిల్ ?
Also Read
“రాక్షసుడు 2” పేరుతో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఓ బిగ్ స్టార్ ఈ రీమేక్ లో హీరోగా నటించనున్నాడని ప్రకటించారు. దీంతో ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించే అవకాశం లేదని అర్థమవుతోంది. ఇక ఈ సీక్వెల్ ను కూడా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మిగతా వివరాలను అతి త్వరలో ప్రకటించనున్నారు. మరి ఈ చిత్రంలో హీరోగా నటించబోయేది ఎవరో చూడాలి.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..