ప్రభాస్ తన అభిమానులకు ఒక ప్రామిస్ చేశాడు . ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా రిలీజ్ చేస్తానని అన్నాడు. అందుకుతగ్గట్టే వరుస సినిమాలు చేస్తున్నాడు. సంవత్సరానికి ఒకటి, రెండు రిలీజ్ అయ్యేలా చూస్తున్నాడు. లాస్ట్ ఇయర్ కల్కితో మెప్పించిన డార్లింగ్ చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలున్నాయి. వీటిలో ముందుగా మారుతి తెరకెక్కిస్తున్న రాజాసాబ్ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడెప్పుడో ఈ సినిమాను సైలెంట్గా మొదలు పెట్టి లీక్డ్ పిక్స్, అఫిషీయల్ పోస్టర్స్, మోషన్ పోస్టర్తో మెల్లిగా హైప్ క్రియేట్ చేశారు.
Also Read : NBK : బాలయ్య కు కథ చెప్పిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్.. ఇది వేరే లెవల్
కాగా ఇటీవల ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ లేదు. మరోవైపు ఏప్రిల్ 10న రిలీజ్ పోస్ట్ పోన్ తర్వాత అసలు ఎం జరుగుతుందని కూడా అప్డేట్ లేదు. ఇటీవల ప్రభాస్ ఇటలీ టూర్ తో అంత గప్ చుప్ అయిపోయింది. కాగా వెకేషన్ ముగించుకుని డార్లింగ్ హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. దాంతో షూటింగ్ మళ్ళి రీస్టార్ట్ అయింది. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పై సీన్స్ తీస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ షెడ్యూలులో త్వరలో ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నాడు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు టీజర్ రెడీ చేస్తున్నారు. ప్రభాస్ డబ్బింగ్ చెప్పాల్సి ఉంది. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ ఉండొచ్చు. ఇప్పటి వరకు జస్ట్ గ్లిమ్స్ మాత్రమే వదిలారు. టీజర్ తర్వాత దర్శకుడు మారుతి వర్క్ తో పాటుగా సినిమా గురించి కూడా గట్టిగా మాట్లాడుకుంటారని సమాచారం. భారీ బడ్జెట్ పై తెరక్కుతున్నరాజాసాబ్ కు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
