NTV Telugu Site icon

Raj Tarun: బ్రేకింగ్: ప్రేమించి మోసం చేశాడు..రాజ్ తరుణ్ పై లవర్ పోలీస్ కేసు

Maxresdefault

Maxresdefault

Hero Rajtarun In Police Case: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ తెరమీదకు వచ్చింది. రాజ్ తరుణ్ మీద ఆయన ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు వేరే వారితో ఉంటున్నాడని రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ మీద లావణ్య ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకుంటానని ముందు నుంచి నమ్మించాడని ఇప్పుడు చేసుకోకుండా మోసం చేశాడని ఆమె ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్ చేశాడని ఇప్పుడు దూరం పెట్టాడని ఫిర్యాదులో లావణ్య పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. గత 11 ఏళ్లుగా తాను రాజ్ తరుణ్తో రిలేషన్ లో ఉన్నానని లావణ్య చెప్పుకొచ్చింది. ఇదే విషయం మీద రాజ్ తరుణ్ సోదరుడు తనను అనేకసార్లు బెదిరింపులకు గురిచేశారని కూడా ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు.

Also Read; The Raja Saab: అవేమీ నమ్మొద్దు.. రాజా సాబ్ టీం కీలక ప్రకటన

కేవలం రాజ్ తరుణ్ తో పాటు రాజ్ తరుణ్ సోదరుడి మీద కూడా లావణ్య ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకుని నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది జనవరి 30వ తేదీన నార్సింగ్ లో పోలీసులు లావణ్యను ఒక డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. అప్పుడే రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య అనే విషయం ఒకసారిగా తెర మీదకు వచ్చింది. అయితే ఈ డ్రగ్స్ కేసు గురించి కూడా లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. తనను కావాలనే కొంతమంది ఇరికించారని తనకు ఆ డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేదని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది. రాజ్‌తరుణ్‌తో 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటికీ, మేము కూడా గుడిలో పెళ్లి చేసుకున్నాం. తన సినిమాలోని ఓ హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకుని ఆ తర్వాత నన్ను వదిలేశాడు, నేను గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుని 45 రోజులు జైలులో ఉన్నాను, ఆ సమయంలో రాజ్ ఎలాంటి సహాయం అందించలేదు అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.