కరోనా కంటే ముందే అది వారిని చంపేస్తుంది… రాశిఖన్నా వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కారణంగా ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా పేదవారు… లాక్ డౌన్ వల్ల చేయడానికి పనిలేక, తినడానికి తిండి లేక ఎంతోమంది పస్తులు ఉంటున్నారు. వారి గురించి తాజాగా హీరోయిన్ రాశిఖన్నా ఓ వీడియోను షేర్ చేశారు. “ఈరోజు లక్షలాది మంది బ్రతకడానికి ఆహారమే ఆక్సిజన్ లా తయారయింది. ఈ మహమ్మారి తెచ్చిన ఏడుపుల ముందు ఆకలి కేకలు వినిపించకుండా పోయాయి. బహుశా ఆకలే వారిని కరోనా వైరస్ కంటే ముందు చంపేస్తుందేమో. జీవనాధారం కోల్పోయి సంపాదన తగ్గిపోయి, ప్రాథమిక ఆహరం కూడా కరువైపోయి ఎన్నో పేద కుటుంబాలు ఈ మహమ్మారి సెకండ్ వేవ్ లో ఆకలితో పస్తులు ఉంటూ జీవితాలు గడుపుతున్నాయి. సహాయ సంస్థలు ఈ కరోనా సమయంలో పని చేస్తూనే ఉన్నారు. ఆకలితో అలమటించే వారికి సహాయం చేస్తున్నారు. అయితే సహాయ సంస్థలు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. నేను కూడా ఈ మధ్య రోటి బ్యాంక్ అనే సంస్థతో సమయం గడుపుతున్నాను. వారి నినాదం ప్రకారం మీరు వంద మందికి భోజనం అందించలేకపోయినా, ఒకరికి అందించండి. ఇప్పుడు వారికి మన సహాయం అవసరం. మన హృదయాలను తెరచి చూడాల్సిన సమయం వచ్చేసింది. అలాగే మన వంతు సహాయం అందించాలి” అంటూ ఈ కష్ట సమయంలో పేదల కష్టాలను కళ్ళకు కట్టే వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో రాశిఖన్నా కూడా కొంతమందికి సహాయం అందించడం మనం చూడొచ్చు.
“2వ వేవ్ సమయంలో ఎక్కువ కుటుంబాలు ఆకలితో పోరాడుతున్నాయి. కేవలం రూ.40తో మీరు రోటీ బ్యాంక్ ద్వారా ఒక ఆకలితో ఉన్న కడుపుకు తిండి సహాయం చేయవచ్చు. రోటీ బ్యాంక్ చేస్తున్న అద్భుతమైన పనికి నేను మద్దతు ఇస్తున్నాను. వీలైతే దయచేసి మీరు కూడా వారికి కూడా వారికీ మద్దతు ఇవ్వండి” అంటూ రిక్వెస్ట్ చేసింది రాశి ఖన్నా. మొన్నటి వరకూ విదేశాలలో సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న రాశి ఖన్నా ఇటీవలే తిరిగి భారతదేశానికి వచ్చారు. ఆమె ఇక్కడ దిగిన వెంటనే ఆమె దానధర్మాలు చేయడం ప్రారంభించింది. కరోనా సమయంలో సెలబ్రిటీ హోదాను కలిగి ఉండటం అర్థవంతంగా ఉంటుందని, ముఖ్యంగా సహాయం కోసం ముందుకు వస్తున్న వారికి అని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ నటి నాగ చైతన్యతో కలిసి “థాంక్స్” చిత్రంలో నటిస్తోంది. మలయాళంలో “అంధాధున్” రీమేక్, షాహిద్ కపూర్ తో హిందీలో కూడా ఒక చిత్రం చేస్తోంది.
Also Read
- Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
- Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
- Irumudi Break: ఒకటిన్నర రోజులోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’తో రవితేజ బాక్సాఫీస్ విధ్వంసం! ట్రేడ్ రిపోర్ట్ ఇదే..
- Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
తాజావార్తలు
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!